Tuesday, 19 May 2020

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందన ఇది..

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందన ఇది..

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై కృష్ణా రివర్‌ బోర్డు స్పందించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ నిర్మిస్తున్న 5 ప్రాజెక్ట్‌లు పునర్‌విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఏపీ ఫిర్యాదు చేసిందని కృష్ణా రివర్ బోర్డు తెలిపింది. నిర్మాణంలో ఉన్న మరో 3 ప్రాజెక్ట్‌లు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదు అందిందని కృష్ణా రివర్‌ బోర్డ్‌ పేర్కొంది. ఈ విషయాలపై వెంటనే వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇరిగేషన్‌ శాఖకు కృష్ణా రివర్‌ బోర్డు లేఖ రాసింది.


కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ సారాంశం..

రాష్ట్ర విభజన చట్టంలోని 84, 85 సెక్షన్లు, 11వ షెడ్యూల్‌ ప్రకారం కేఆర్‌ఎంబీ, కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలి. రాష్ట్ర విభజన జరిగాక మిగులు జలాల పేరిట కృష్ణా ట్రైబ్యునల్‌ -1 ఆమోదం లేకుండానే 16.87 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం 150.53 టీఎంసీల సామర్జ్యం కలిగిన 5 కొత్త ప్రాజెక్టులను తెలంగాణ చేపట్టింది. ఇది కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఉల్లంఘించడమే.


అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ, కేంద్ర జల సంఘం ఆమోదం కూడా తీసుకోలేదు. మేం ఈ అంశంపై పదే పదే ఫిర్యాదు చేయడంతో తెలంగాణ నుంచి డీపీఆర్‌ను తీసుకోవాలని కృష్ణా బోర్డుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సూచించింది. బోర్డు ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయని తెలంగాణ.. దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు అన్యాయం చేసేలా ప్రాజెక్టులను నిర్మిస్తూనే ఉంది.

No comments:

Post a Comment