Monday, 5 July 2021

New politics around Krishna Waters

 నీళ్ల చుట్టూ నయా రాజకీయం!

Jul 4 2021 


చెట్టుఎక్కుదామంటే ఆకులు అడ్డొస్తున్నాయని వెనుకటికి ఎవడో అన్నాడట! కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పటికీ... హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించవలసి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఇలాగే ఉంది. జగన్‌ రెడ్డి పుట్టక ముందు నుంచే సీమాంధ్రులు తెలంగాణలో ఉంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా వారికెవరూ ఎటువంటి అపకారమూ చేయలేదు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు వచ్చిన కష్టం కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆంధ్రాలో ఉంటున్న వారి కంటే తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులే ఎక్కువగా అభివృద్ధి చెందారు. తమ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణలో ఫిర్యాదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇందుకు విరుద్ధంగా కంపెనీలను, సంస్థలను గుంజుకుని అస్మదీయులకు కట్టబెడుతున్నారు. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోపై అధికార పార్టీ పెద్దలు కన్నేశారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలజగడంపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యతిరేకించే దమ్ము, ధైర్యం లేని జగన్‌ అండ్‌ కో ఇప్పుడు హైదరాబాద్‌లోని సీమాంధ్రులను రక్షణ కవచంగా వాడుకోవాలని చూడటం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిన జగన్‌ రెడ్డి, తాను అగ్రజుడిగా భావిస్తున్న కేసీఆర్‌కు మాత్రం ఫోన్‌ చేసే సాహసం చేయలేదు. తాను సంయమనం కోల్పోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఏమవుతుందోనని ఇప్పుడు ఆందోళన పడుతున్న జగన్‌ రెడ్డి, 2016లో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. అప్పుడు జగన్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివసించేవారు. అప్పటికి తాడేపల్లికి మకాం మార్చలేదు. అయినా తాము చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన జగన్‌ రెడ్డికి నష్టం చేయడానికి తెలంగాణవాదులు ప్రయత్నించిందేమీ లేదు. అప్పట్లో ఓటుకు నోటు కేసుకు భయపడి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదని జగన్‌ అండ్‌ కో నిందించారు. అవన్నీ గుర్తున్నవాళ్లు హైదరాబాద్‌లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికే జగన్‌ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఇప్పుడు నిందిస్తున్నారు. ఇంతకూ కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండిగా వ్యవహరిస్తున్నదా? లేక రాయలసీమకు నీటిని తరలించడం కోసమే ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నదా? ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉంటాయి కనుక నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పరిస్థితి సహజంగానే పైచేయిగా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ మధ్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల మధ్య జల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజల ప్రయోజనాలు పక్కకు జరిగి రాజకీయ ప్రయోజనాలు చొరబడతాయి. ఇప్పుడు ఆంధ్రా–తెలంగాణ మధ్య జరుగుతున్నది ఇదే! 



PauseUnmute

Fullscreen

VDO.AI



ఆనాడే మేల్కొని ఉంటే...


పులిచింతల ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం అన్యాయం అని, దీనివల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్నాయని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి ఏర్పడటానికి సీమాంధ్రకు చెందిన నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడమే కారణం. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. వరదలొచ్చినప్పుడు నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేసే నీటి నుంచి 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్‌ చేశారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తొలుత ఎన్టీఆర్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. పులిచింతలకు కుడివైపున విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు. అప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రాంతం ముంపునకు గురవుతుందంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత విద్యుత్‌కేంద్రాన్ని ఎడమవైపున నిర్మించాలని వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచన చేసింది. దీంతో పులిచింతల ఎడమ వైపున, అంటే తెలంగాణ భూభాగంలో విద్యుత్‌ కేంద్రం నిర్మితమైంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణానదికి కుడి వైపున ఉన్న విద్యుత్‌కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ వైపున ఉన్నవాటిని తెలంగాణకు పంచారు. ఈ కారణంగానే పులిచింతల వద్ద విద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారం, వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి లభించాయి. పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందినప్పటికీ విద్యుత్‌కేంద్రం మాత్రం తెలంగాణకు దక్కింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణవాదులు తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టగా, సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమని అప్పుడే గుర్తించి, తమ భూభాగంలో నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టులో భాగమైన విద్యుత్‌ కేంద్రాన్ని కూడా తమకే కేటాయించాలని పట్టుబట్టి ఉంటే దక్కి ఉండేదేమో! అంటే నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ విద్యుత్‌కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏడిస్తే ఏం ప్రయోజనం? తమకు దక్కిన విద్యుత్‌కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకు ఉండదా? ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోకి వచ్చే కుడివైపున ఆనాడే విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించినా ప్రస్తుత పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఈ విషయం అలా ఉంచితే, పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల కృష్ణాజిల్లాకు సాగునీటి సమస్య తీరిపోయింది. కృష్ణాజలాల కోసం వేచిచూడకుండా రైతులు సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. వేసవిలో మంచినీటి కొరత ఏర్పడినప్పుడు మాత్రమే పులిచింతల ఉపయోగపడుతోంది. ఈ సీజన్‌లో వరదలు రాని పక్షంలో పులిచింతల ఖాళీ అయిపోతుంది. అప్పుడు మంచినీటి కొరత ఏర్పడినా నీళ్లు ఉండవు. అయితే కాళేశ్వరం నుంచి వర్షాకాలంలోనే నీటిని ఎత్తిపోస్తున్నారు కనుక విద్యుత్‌ అవసరం తెలంగాణకు ఎక్కువగా ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎవరిని తప్పుబట్టాలి?




రాజకీయమే పరమావధి!


హైదరాబాద్‌లోని సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవడానికి జగన్‌ రెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆహ్వానించిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చిన జగన్‌ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలియడం లేదు. ప్రధానికి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీ చూసి స్పందించేలోపు పులిచింతల ఖాళీ అవుతుంది. పులిచింతలలో నిల్వ ఉన్న నీరు ఎండాకాలం అవసరాలకు కావలసి ఉంటుందని జగన్‌ రెడ్డి భావించే పక్షంలో కేసీఆర్‌కు ఫోన్‌ చేసో, లేక వ్యక్తిగతంగా కలిసో... ‘మీకు విద్యుత్‌ కావాలనుకుంటే పులిచింతలలో ఎంత ఉత్పత్తి చేస్తున్నారో అంత విద్యుత్‌ను శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి చేసి ఇస్తాం. నీళ్లను మాత్రం వృథా చేయవద్దు’ అని కోరవచ్చు కదా! ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా తెలంగాణ మంత్రులు నోరు జారడం, ఆంధ్రా ప్రాంత మంత్రులు లేస్తే మనుషులం కాదన్నట్టుగా ఉత్తుత్తి హెచ్చరికలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల సమస్యలను కూడా జటిలం చేస్తూ రాజకీయ అవసరాల కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇరువైపులా జరుగుతోంది. రాయలసీమకు మేలు చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే కేసీఆర్‌ అండ్‌ కో ఇబ్బందులు సృష్టిస్తున్నారని సీమప్రజలు భావించాలని జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఉంది. తెలంగాణకు చెందిన నీటిని జగన్‌ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తరలిస్తూ ఉంటే తాను పోరాడుతున్నానని తెలంగాణ ప్రజలు భావించాలని కేసీఆర్‌ కోరుకుంటున్నట్టుగా ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరిగే వరకు ఇదే తంతు కొనసాగవచ్చు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి అవసరం ఇంకా ఉందని ప్రజలు భావించేలా కేసీఆర్‌ ఎత్తుగడలు ఉన్నాయి. అనుమతులు, నిధుల కేటాయింపులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూపెట్టి సీమప్రజల మనసు చూరగొనవచ్చునన్నది జగన్‌ రెడ్డి కోరిక కావచ్చు. మొత్తానికి ఇద్దరికీ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి కనుక ప్రస్తుత ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా పులిచింతలను ఖాళీ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందంటే అది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకే. వచ్చే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడితే ఇబ్బంది పడేది వారే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ రెడ్డి బలహీనతలు, బేలతనం బయటపడుతున్నాయి. నిన్నటిదాకా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని బీరాలు పలికి ఇప్పుడు ‘మనం చేయగలింది ఏమీ లేదు’ అని చేతులెత్తేశారు. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా తన వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌కు లొంగిపోక తప్పని పరిస్థితి జగన్‌ రెడ్డికి ఏర్పడింది. అంతేనా, ఎన్నికల సమయంలో కేసీఆర్‌ పలు రూపాల్లో చేసిన సహాయాన్ని మర్చిపోయి రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడగలరు? అందుకే హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను బూచిగా చూపిస్తున్నారు. సర్వ అనర్థాలకూ చంద్రబాబు నాయుడే కారణం అని చెబుతూ వస్తున్న జగన్‌ అండ్‌ కోకు ప్రస్తుత వివాదానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పవచ్చునన్న ఆలోచన ఎందుకు రాలేదో!? పొరుగు రాష్ర్టాలతో, ముఖ్యంగా తెలంగాణతో సఖ్యతగా ఉండాలని తరచుగా చెప్పే జగన్‌ రెడ్డి.. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానికి ఫిర్యాదు చేయడం ద్వారా చేతులు దులుపుకొన్నారు. రాయలసీమను కూడా కోనసీమగా చూడాలని ఉందని ఏడాదిన్నర క్రితం గొప్పగా చెప్పి ఔదార్యాన్ని చాటుకోవడమే కాకుండా నగరిలో ఉండే ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ప్రస్తుత వివాదానికి తెర తీశారు. జగన్‌ రెడ్డి కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలో ఉన్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధపులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి గాండ్రించేవి. ఇప్పుడు తమవాడే అధికారంలో ఉన్నందున వారికి రాయలసీమలో ఎనలేని అభివృద్ధి కనిపిస్తూ ఉండవచ్చు. సీమాంధ్ర నాయకుల గురించి కేసీఆర్‌కు బాగానే తెలుసు కనుక ఆయన ఇలాగే ముందుకు వెళుతూ ఉంటారు. నిజానికి ఈ నీళ్ల జగడం వెనుక ఇంకేదో మతలబు కూడా ఉంది. తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల సొంత పార్టీ పెట్టుకోవడంపై కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారట. సోదరిని కట్టడి చేయలేకపోతున్న జగన్‌ రెడ్డిపై ఆయన మండిపడుతున్నారట. ఈ వ్యవహారంలో జరగబోయేది ఏమిటి? జరిగింది ఏమిటి? అన్నది వచ్చే వారం చెప్పుకొందాం!




పంథా మార్చుకునే ప్రసక్తే లేదు!


గత వారం నేను వెల్లడించిన కొన్ని అంశాలపై నీలిమీడియాలో భాగంగా ఉంటున్న జగన్‌ రెడ్డి భక్తులు గుండెలు బాదుకున్నారు. జగన్‌బాబును బాధపెడతారా? ఇదేమి జర్నలిజం అంటూ చిందులు తొక్కారు. మంత్రి కొడాలి నాని యథావిధిగా బూతులు తిట్టారు. ‘ఆంధ్రజ్యోతి’కి, ‘ఏబీఎన్‌’కూ విశ్వసనీయత లేదని నోరు పారేసుకున్నారు. జగన్‌ రెడ్డి–షర్మిల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయని, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను బహిర్గతం చేసినప్పుడు కూడా ఇలాగే నిందించారు. అప్పుడు నేను చెప్పిందే నిజమైంది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. కరోనా గురించి భయపడాల్సింది లేదని ఏసు ప్రభువు తనకు చెప్పారని జగన్‌ రెడ్డి అధికారులతో ఎప్పుడు అన్నదీ తేదీతో సహా గత వారం నేను వెల్లడించాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తూ ఆ సమయంలో అక్కడే ఉన్న అధికారి ద్వారా సదరు విషయం నాకు తెలిసిందని కూడా చెప్పాను. మాజీ ఐఏఎస్‌ అధికారి చెప్పారు అని అంటే, ఆ అధికారి ఎవరో బయటపెట్టాలని సవాలు విసిరారు. సమాచారం అందించే వారి పేర్లను జర్నలిస్టులు వెల్లడించాల్సిన అవసరం లేదని నన్ను విమర్శించిన వారికి తెలియకపోవడం విషాదం! ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఏం జరిగినా అదంతా దేవుడు రాసిన స్ర్కిప్టు ప్రకారమే జరుగుతోందని నమ్మే వ్యక్తి జగన్‌ రెడ్డి. అలాంటప్పుడు అదే దేవుడు ఐఏఎస్‌ అధికారితో ఆ సమాచారాన్ని నాకు చెప్పించి ఉంటారని భావించకుండా నీలిమూకను ఉసిగొల్పడం ఎందుకో? దారిన పోయే దానయ్య చెబితే రాస్తారా? అంటూ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొందరు వ్యాఖ్యలు చేశారు. కాలమిస్టులు సమాచారం ఎలా సేకరిస్తారో ఇలాంటి వాళ్లు మరచిపోయి ఉంటారు. తాము అమితంగా ప్రేమించే జగన్‌ రెడ్డికి నష్టం జరుగుతుందని భావించే వాళ్లు బాధపడడంలో, నన్ను విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. నేను జర్నలిజంలోకి ప్రవేశించిన కొత్తలో ‘హిందూ’ బ్యూరో చీఫ్‌గా రాజేంద్రప్రసాద్‌, ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు సుందరం, ‘దక్కన్‌ క్రానికల్‌’కు రవీంద్రనాథ్‌, ‘ఈనాడు’కు ఎస్‌.ఎన్‌.శాస్ర్తి, ‘ఆంధ్రజ్యోతి’కి ఐ.వెంకట్రావ్‌, ‘ఆంధ్రపత్రిక’కు పాపయ్యశాస్ర్తి బ్యూరో చీఫ్‌లుగా ఉండేవారు. వీరంతా ప్రతి వారం తమ పేరిట కాలమ్స్‌ రాసేవారు. ఆ వారంలో జరిగిన పరిణామాలకు తాము సేకరించిన సమాచారాన్ని జోడించి కాలమ్స్‌ రాసేవారు. ఆనాడు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు సైతం రాజకీయాల్లో ఏం జరుగుతోంది, సొంత పార్టీలోని తమ ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏమిటి అనేవి తెలుసుకోవడానికి సదరు కాలమ్స్‌ పైనే ఆధారపడేవారు. అప్పుడు నీకా సమాచారం చెప్పింది ఎవరు? అని వారెవరూ అడిగేవారు కాదు. కాలమిస్టులు రాసిన దాంట్లో నుంచి తెలుసుకోవలసిన సమాచారాన్ని తీసుకునేవారు. ఇప్పుడు వారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిసినవాళ్లు కూడా ఎవరో ఐఏఎస్‌ అధికారి చెబితే మాత్రం రాసేయడమేనా? అని తెగ బాధపడిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. మీడియాలో ఉండే వారికి వివిధ మార్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది. మనకుండే పరిచయాలను బట్టి రహస్య సమాచారం కూడా అందుతూ ఉంటుంది. జాతీయ మీడియాలో కూడా ఇలాగే సమాచారం వస్తుంది. నాకు సమాచారం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారిని దారిన పోయే దానయ్య అని నిందించే వాళ్లను చూసి జాలిపడాల్సిందే. ఏ కాలమిస్ట్‌కు అయినా వారికి ఉండే విశ్వసనీయతను బట్టి సమాచారం అందిస్తారు. నీకు మాత్రమే ఎందుకు చెప్పారు అంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. జగన్‌ రెడ్డిని విమర్శించడమే మహాపాపం అన్నట్టుగా నీలిమీడియాలో భాగమైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు మేలు చేయడం కోసమే జగన్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారని విమర్శించడం ఫ్యాషన్‌ అయింది. తప్పుడు వార్తలు రాస్తే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు పెట్టమని ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి ఆదేశించడమే కాకుండా జీవో కూడా జారీ చేశారు కదా! మేం నిజంగా తప్పుడు వార్తలే రాసి ఉంటే ఈపాటికి మాపై కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు కాదా? చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’కి అయాచితంగా వందల కోట్లు దోచి పెట్టారని ఇదే నీలిమూక ప్రచారం చేసింది. అదే నిజమై ఉంటే జగన్‌ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని నిద్రపోనిచ్చే వారా? మేం అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, జైల్లో వేస్తాం అన్నారు. రెండేళ్లు గడచినా ఏమీ చేయలేదే! అంటే మేం ఏ తప్పూ చేయలేదనే కదా! ‘ఆంధ్రజ్యోతి’ని పునఃప్రారంభించి 19 ఏళ్లు అవుతోంది. నాపై విమర్శలు చేసేవారి మాటలు నిజమే అనుకుందాం. ఈ పందొమ్మిదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదేళ్లు మాత్రమే మాతో ఘర్షణకు దిగని ప్రభుత్వం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ ప్రభుత్వాలు మా సంస్థలపై కత్తిగట్టి వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనల రూపంలో మాకు న్యాయంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వకపోయినా మేం ఎవరినీ దేబిరించడం లేదు. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు మాకు ఎంత నష్టం చేస్తున్నాయో నన్ను విమర్శించే వారికి తెలియదా? చంద్రబాబు కోసమో మరొకరి కోసమో మేం ఇంతలా నష్టపోవాల్సిన అవసరం లేదు. మేం నమ్మిన విలువలకు మాత్రమే కట్టుబడి ఉంటాం. పేటీఎం బ్యాచ్‌లో చేరిపోయి పారితోషికం కోసం నన్ను విమర్శించే వారివలె నేను ఎవరి వద్దా చేయి చాచను. అలాగైతే నేను కూడా జగన్‌ రెడ్డి, కేసీఆర్‌ వద్దకు వెళ్లి రాజీపడిపోవచ్చు కదా! మీడియా కూడా నిర్వీర్యం అయితే నోరు లేని వారికి దిక్కే ఉండదు. అందుకే ప్రశ్నించే గొంతుకగా ఉండటానికే నేను ఇష్టపడతాను. ప్రతి వారం నేను రాసే కాలమ్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యాఖ్యానాల వీడియోలను యూట్యూబ్‌లో పెట్టుకొని పలువురు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. ఇదొక రకంగా నాకు గర్వకారణమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి పాలన ఎలా ఉందో బుద్ధిజీవులు గ్రహించారు. వారంతా మాకు మద్దతుగా ఉన్నారు. మాకు సమాచారం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు. జగన్‌ రెడ్డిపై అంతులేని ప్రేమతో పాటు చంద్రబాబుపై నిలువెత్తు విషం నింపుకొన్న వారు తమ మెదళ్లకు పట్టిన బూజును వదిలించుకోకుండా విమర్శిస్తే మాకు పోయేది ఏమీ లేదు. అటువంటి వాళ్లు రాష్ట్రప్రజలకు అపకారం చేసిన వారవుతారు. మీకు నచ్చిన నాయకుడిని మీరు పొగుడుకోండి. పల్లకీలో ఊరేగించుకోండి. మీ బాటలోనే అందరూ నడవాలని కోరుకోవడం సరికాదు. జగన్‌ రెడ్డితో ఏసు ప్రభువు మాట్లాడారా? లేదా? అన్న విషయాన్ని ఏసు ప్రభువు చెప్పాలి, లేదా జగన్‌ రెడ్డి చెప్పాలి. జగన్‌ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయని ఒక అధికారి చెప్పిన విషయాన్ని మాత్రమే నేను రాశాను. అది నిజం కాదని చెప్పే అర్హత ఇతరులకు ఉండదు. ఇక మంత్రి కొడాలి నాని అయితే మేం ఏం రాసినా తమకు ఏమీ ఊడదు అనీ, ఏమీ రాలదు అనీ అన్నారు. కొడాలి నాని నోటి నుంచి వచ్చే దుర్గంధపూరిత భాష వల్ల మాకు కూడా ఏమీ ఊడదు. ఈ 19 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్నో దాడులను భరించాం. కిరాయి సైనికులుగా మారిన కొంతమంది నీలిమీడియా భాగస్వాములు చేస్తున్న విమర్శలు మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. ‘ఆంధ్రజ్యోతి’ సాగిస్తున్న ప్రయాణం సరైన దారిలోనే ఉందని మేం భావిస్తున్నాం. అది నిజం కాని పక్షంలో ఫలితాన్ని కూడా మేమే అనుభవిస్తాం. అంతేగానీ ఆర్థిక ప్రయోజనాల కోసం మా పంథాను మార్చుకోబోం!


ఆర్కే

Krishna river water dispute

 జల వివాదంలో నలుగుతున్న రైతులు


Jul 5 2021


కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టులో ఆందోళన

వచ్చిన నీటినీ వాడుకోలేని ఏపీ సర్కారు 

ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా నీరు

కాల్వలు ఎండగట్టి.. సముద్రంలోకి!

ప్రాజెక్టుల్లో ప్రతి చుక్కా ముఖ్యమే!

కాపాడుకోవాలంటున్న రైతులు, నిపుణులు

సామరస్య పరిష్కారం కోసం ఎదురుచూపులు


పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వరుసగా మూడేళ్లు జూన్‌ నెల మొదటి వారంలోనే కృష్ణా డెల్టాకు నీటిని అందించగలిగారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టిసీమను పట్టించుకోలేదు.  ఆ ఏడాది జూలై చివరిలో పట్టిసీమ నుంచి నీటి విడుదల చేశారు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి.

(విజయవాడ, నరసరావుపేట, తెనాలి-ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యం నీరై పారుతోంది. కాల్వలకు.. అక్కడి నుంచి చెరువులకు, పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. రెండేళ్లు నిండితే.. ఏడాది ఎండిపోయే కృష్ణా ప్రాజెక్టుల నుంచే నీరు వృథా అవుతోంది. దీంతో.. మున్ముందు పంటలకు నీళ్లు అందుతాయో లేదోనని సాగర్‌ ఆయకట్టు, ఇటు కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రస్తుతం జూరాల నుంచి పులిచింతల వరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. పులిచింతల నుంచి వదిలిన నీరు నేరుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని చేరుతోంది. ఈ బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు మాత్రమే. అంతకు మించి వచ్చిన నీటిని కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు అందించాలి. లేదా.. సముద్రంలోకి వదిలేయాలి. ఇప్పుడు.. నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కాల్వల ద్వారా సాగుకు నీళ్లు విడుదల చేయడం లేదు. గత 3 రోజుల్లో 1.5 టీఎంసీలకు పైగా జలాలను సముద్రంలోకి వదిలేసింది. సాగునీటికి లాకులెత్తలేదు. సోమవారం నుంచి విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.


కాల్వల్లో కన్నీరు: గతంలో కృష్ణా డెల్టాలో జూలై మొదటివారంలో ఖరీఫ్‌ పనులు ప్రారంభమయ్యేవి. పంట చేతికి వచ్చే సరికి నవంబరు వచ్చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి తరచూ తుఫాన్లు విరుచుకుపడటంతో పంటలు దెబ్బతినేవి. ‘పట్టిసీమ’ రూపంలో 2016 నుంచి ఈ దుస్థితి తప్పింది. జూన్‌ మొదటి వారంలోనే కాల్వలకు నీరు విడుదల చేసేలా గత టీడీపీ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. అయితే... పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణం కారణంగా పట్టిసీమ నీరు ఇప్పట్లో ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం లేకుండా పోయింది. అదే సమయం లో.. తెలంగాణ సర్కారు జలవిద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటిని వేర్వేరు కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. శుక్రవారం నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి నీటి విడుదల ప్రణాళికలు చేయాల్సిన అధికారులు.. మూడు రోజుల క్రితం ఐఏబీ సమావేశం నిర్వహించి.. సోమవారం కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈలోపు వచ్చిన నీటిని మాత్రం వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితిపై  రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సాగర్‌ ఆయకట్టుదీ అదే కథ..

కృష్ణా డెల్టా రైతులది ఒక వ్యథ అయితే.. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉన్న నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులది మరో కథ! సాగర్‌ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్‌ నిండి కాల్వల్లోకి నీరు ప్రవహిస్తేనే ఇక్కడ పంటలు పండేది. ప్రస్తుతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదు. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండి.. అక్కడ గేట్లు ఎత్తితేనే సాగర్‌ చెంతకు కృష్ణమ్మ చేరుతుంది. అయితే, ‘జల విద్యుదుత్పత్తి మా హక్కు’ అంటూ తెలంగాణ సర్కారు దూకుడుగా ముందుకు వెళుతోంది. సాగర్‌ నుంచి ఇప్పటికి 26.95 టీఎంసీల నీటిని జల విద్యుదుత్పత్తి కోసం కిందికి వదిలేసినట్లు ఏపీ అధికారులు అం చనా వేస్తున్నారు. ఆదివారం సాగర్‌ నుంచి 62,134 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 21,189 క్యూసెక్కులు, పులిచింతల నుంచి 7,200 క్యూసెక్కులను జలవిద్యుత్తు కోసం వదిలారు. ఇప్పట్లో జల జగడం సద్దుమణిగే అవకాశం కనిపించడంలేదు. అంటే.. జలవిద్యుదుత్పత్తి రూపంలో మరింత నీరు దిగువకు పోతూనే ఉంటుంది. రెండు ప్రభుత్వాలు ఇప్పటికైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఇది దారుణం!

పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి ద్వా రా విడుదలవుతున్న నీటిని సముద్రంలో కి వృథాగా వదలడం కంటే డెల్టాకు విడుదల చేస్తే ప్రయోజనం ఉండేది. నారుమడులు కాస్త ముందుకు జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేయడం అనైతికం.  ఆ నీటిని మన ప్రభుత్వం సముద్రంలోకి వదలడం దారుణం. 

- ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, సాగునీటి 

వినియోగదారులసమాఖ్య గౌరవాధ్యక్షుడు

వారు అడగకపోవడం వల్లే

నీటి విడుదల కోసం ప్రకాశం బ్యారేజీదిగువ ప్రాంతాల నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. కాల్వలకు ఎప్పుడు నీరు విడుదల చేయాలన్న దానిపై నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సాగుకు ఈ నెల 5 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు డెల్టా కాల్వలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నాం. 

- వరప్రసాద్‌, ప్రకాశం బ్యారేజీ డీఈ


Jul 5 2021 @ 13:43PMహోంఆంధ్రప్రదేశ్జల జగడంపై కేంద్ర మంత్రులకు సీఎం జగన్‌ లేఖఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను విద్యుదుత్పత్తికి వాడుకుంటోందని, కేఆర్‌ఎంబీ ఆదేశించినా వినకుండా జలాలను వినియోగించుకుంటోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన 34 జీవో పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. రాయలసీమకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, అదనపు ఆయకట్టు లేదని, కేటాయించిన నీటినే వాడుకుంటామన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేఆర్‌ఎంబీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ పథకాలు నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అక్రమ ప్రాజెక్టులను సందర్శించి నిలిపివేయాలని కోరినా కేఆర్‌ఎంబీ వెళ్లలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వద్దకు వస్తామని లేఖలు రాస్తున్నారని, తమ వద్దకు వచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించాల్సిందేనని  సీఎం జగన్‌ అన్నారు.

అక్కడ ప్రాజెక్టులను సందర్శించకుండా ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలని, రిజర్వాయర్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. తటస్థంగా ఉండాల్సిన కేఆర్‌ఎంబీ అధికారులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కేఆర్‌ఎంబీ అధికారులకు తగిన సూచనలు చేయాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆ లేఖలో కోరారు.




Friday, 2 July 2021

Heavy inflow to Prakasham barrage

 praకాశం బ్యారేజీకి వరద ప్రవాహం


Jul 2 2021

విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రహదారులపై నీరు నిలిచి చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని బట్టి బ్యారేజీ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడతోపాటు కృష్ణా జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులుపడ్డారు. విజయవాడలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వర్షాల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతాంగం భావిస్తోంది

Krishna Water dispute

 కృష్ణా నీళ్లు కడలిపాలు!

Jul 2 2021 


జలాశయాల్లో అడుగంటిన నీరు..


తెలంగాణ నిర్వాకంతో సముద్రంలోకి వృథాగా జలాలు


అక్రమ విద్యుదుత్పత్తితో సాగుకు చేటు..


ఆందోళనలో కృష్ణా డెల్టా రైతాంగం




అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయి కనిపిస్తున్నాయి. ఎగువనుంచి వరద కోసం ఎదురు చూస్తున్నాయి. ఖరీఫ్‌ మొదలు కావడంతో కృష్ణా ప్రాజెక్టులపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు పెద్దగాప్రభావం చూపకపోవడంతో రాష్ట్రంలో వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తోడేస్తోంది. ఆ నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయడంతో సరిపెట్టకుండా.. అక్కడా అనుమతి లేకుండా విద్యుదుత్పాదన సాగిస్తోంది. దాంతో విడుదలయ్యే నీరు పులిచింతలకు చేరుతోంది. తెలంగాణ అధికారులు అక్కడకూడా కరెంటు ఉత్పత్తి చేస్తుండడంతో.. అటునుంచి నీరు ప్రకాశం బ్యారేజీకి ప్రవహిస్తోంది. బ్యారేజీలో 3 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.




ఫలితంగా కృష్ణా డెల్టా రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఎగువన కర్ణాటకలో ఆలమట్టి గేట్లను ఎత్తి కిందకు నీళ్లొదిలితే తప్ప.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిండవు. ఇప్పట్లో ఆలమట్టి నుంచి నీళ్లొదిలే పరిస్థితి కనిపించడం లేదని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 93.97టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 15,786 క్యూసెక్కుల ప్రవాహం ఆలమట్టిలోకి చేరుతోంది. దిగువన, జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్‌ పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిసామర్థ్యం 37.84 టీఎంసీలకు గాను.. 26.39 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. మరో 11.25 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరితేతప్ప నారాయణపూర్‌ నిండదు. అది నిండితేనే దిగువకు నీరు వదులుతారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌ దుస్థితి మరీ దయనీయంగా ఉంది.




శ్రీశైలం గరిష్ఠ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడు అత్యల్పంగా 43.27 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. పూర్తిగా నిండాలంటే మరో 173 టీఎంసీల వరద రావాలి. సాగర్‌లో గరిష్ఠ నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను .. 176.26 టీఎంసీల నిల్వ ఉంది. మరో 135.79 టీఎంసీల వరద రావాలి. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను.. 21.21 టీఎంసీల నిల్వ ఉంది. అట్టడుగున ఉన్న ప్రకాశం బ్యారేజీలో గరిష్ఠ నీటి నిల్వలు (3.07 టీఎంసీలు) ఉన్నాయి. వరద వస్తే సముద్రంలోకి వదలడం తప్ప గత్యంతరం లేదు.





40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.PH: 9390 999 999,    98481 97 222Jul 2 2021 @ 02:20AMహోంఆంధ్రప్రదేశ్తక్షణం జోక్యం చేసుకోండిఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

జల జగడంపై ప్రధాని మోదీకి సీఎం లేఖ


ప్రాజెక్టులన్నిటికీ సీఐఎస్‌ఎఫ్‌ భద్రత.. కృష్ణా బోర్డు పరిధి స్పష్టం చేయండి


శ్రీశైలం నీటిని తెలంగాణ అనధికారికంగా వాడేస్తోంది.. సమస్యలు సృష్టిస్తోంది


ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేసింది..


సాగర్‌, పులిచింతలలోనూ దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి


విడుదల చేసే నీరంతా ప్రకాశం బ్యారేజీకే..


అక్కడ నిల్వ వసతి లేదు.. వృథాగా సముద్రంలోకే


అందుకే జోక్యం అవసరం: ప్రధానికి సీఎం అభ్యర్థన..


జలశక్తి మంత్రి షెకావత్‌కూ విడిగా లేఖ




అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు సృష్టిస్తోందని.. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుల నుంచి దౌర్జన్యంగా తెలంగాణ నీటిని తోడేయకుండా ఉండేందుకు .. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు  కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని అభ్యర్థించారు. జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా తెలంగాణ నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం జగన్‌ ప్రధానికి గురువారం నాడు ఐదు పేజీల లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా విడిగా ఈ అంశంపై లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందని ప్రధానికి సీఎం వివరించారు.




తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలే తీరుస్తున్నాయని.. సాగర్‌, జూరాల ప్రాజెక్టులను తెలంగాణ పర్యవేక్షిస్తుంటే.. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) సమయానుకూలంగా నీటి కేటాయింపులు., వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఆ బాధ్యతల కేటాయింపు ఇంకా పూర్తికాలేదన్నారు. లేఖలో ఇంకా ఏమన్నారంటే..




మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.. 


‘2015 జూన్‌ 18,19 తేదీలో  కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299, ఆంధ్రకు 512 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి  విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శ్రీశైలం నుంచి 6.9 టీఎంసీలను ఏకపక్షంగా వాడేసింది. ఈ విషయాన్ని కేఆర్‌ఎంబీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నాగార్జున సాగర్‌ కూడా మరో ఉమ్మడి జలాశయం. ఈ ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా.. దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని తోడేస్తోంది. పులిచింతల నుంచి సైతం అక్రమంగా విద్యుదుత్పత్తిని చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌,  పులిచింతల జలాశయాల నుంచి నీటిని అక్రమంగా తోడేయడమే కాకుండా.. జల విద్యుదుత్పత్తి పూర్తి సామర్థ్యంతో చేపట్టేలా 34వ నంబరు జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది.




ఇలా ప్రధాన జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను కిందకు వదిలేయడం వల్ల చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.7 టీఎంసీ కావడంతో.. నీటిని నిల్వ చేసుకునే వీలు లేక కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. జలవిద్యుదుత్పత్తి ఆపేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించినా.. తెలంగాణ బేఖాతరు చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ నీటిని వాడేయడం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీరు కూడా అందని దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో తక్షణమే మీరు (ప్రధాని) ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.’




Jul 2 2021 @ 02:34AMహోంతెలంగాణదౌర్జన్యంగా విద్యుదుత్పత్తిఅన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50

ప్రాజెక్టులన్నింటికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించండి

శ్రీశైలం నీటిని తెలంగాణ అనధికారికంగా వాడేస్తోంది

కృష్ణాబోర్డు పరిధి స్పష్టం చేయండి.. ప్రధానికి జగన్‌ లేఖ

విద్యుదుత్పత్తితో వదిలే నీరంతా ప్రకాశం బ్యారేజీకే

అక్కడ నిల్వ వసతి లేదు.. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకే

తక్షణమే జోక్యం చేసుకోండి.. తెలంగాణపై ఫిర్యాదు

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కూ విడిగా లేఖ



అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తూ తమ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు సృష్టిస్తోందని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుల నుంచి దౌర్జన్యంగా తెలంగాణ నీటిని తోడేయకుండా ఉండేందుకు.. తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎ్‌సఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు  కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని అభ్యర్థించారు. జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ అక్రమంగా నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం జగన్‌ ప్రధానికి గురువారం నాడు ఐదు పేజీల లేఖ రాశారు.




కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా విడిగా ఈ అంశంపై లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందని ప్రధానికి సీఎం వివరించారు. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలే తీరుస్తున్నాయని.. సాగర్‌, జూరాల ప్రాజెక్టులను తెలంగాణ పర్యవేక్షిస్తుంటే.. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. లేఖలో ఇంకా ఏమన్నారంటే..




మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస ‘2015 జూన్‌ 18, 19 తేదీలో  కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నుంచి  విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శ్రీశైలం నుంచి 6.9 టీఎంసీలను ఏకపక్షంగా వాడేసింది. ఈ విషయాన్ని కేఆర్‌ఎంబీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నాగార్జునసాగర్‌ కూడా మరో ఉమ్మడి జలాశయం. ఈ ప్రాజెక్టు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని తోడేస్తోంది.


పులిచింతల నుంచి సైతం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం, సాగర్‌,  పులిచింతల జలాశయాల నుంచి నీటిని అక్రమంగా తోడేయడమే కాకుండా.. జల విద్యుదుత్పత్తి పూర్తి సామర్థ్యంతో చేపట్టేలా 34వ నంబరు జీవోను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా ప్రధాన జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను కిందకు వదిలేయడం వల్ల చివరన ఉన్న ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.7 టీఎంసీ కావడంతో.. నీటిని నిల్వ చేసుకునే వీలు లేక కృష్ణా జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. జలవిద్యుదుత్పత్తి ఆపేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించినా.. తెలంగాణ బేఖాతరు చేస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణమే మీరు (ప్రధాని) ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.’

Tuesday, 22 June 2021

Krishna waters - AP

 మొత్తంగా కృష్ణాజలాలకే ఎసరు పెట్టారు!

Jun 23 2021


సాగునీటి రంగంలో తాను అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఏమిటో తెలిసి వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. కేంద్ర ప్రభుత్వం తోక కోసి సున్నం పెడుతున్నా గట్టిగా అడగ లేకున్నది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యక్ష పోరాటానికి సవాలు విసిరినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తదనుగుణమైన చర్యలు ఏమీ కనించడం లేదు. ఈ అంశంలో కేసీఆర్ ద్విముఖ పోరాటానికి తెర లేపారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ ఈ పాటికే వ్యూహాత్మకంగా పైచేయి సంపాదించారు. ఒకవైపు అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునలును గాని లేదా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు బాధ్యత అప్పగించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ వద్ద మాట తీసుకున్నారు. ఇదే జరిగితే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టియంసిలు భవిష్యత్తు గాలిలో దీపమే. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్‍తో బస్తీమే సవాల్ అంటూ పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను మెతక వైఖరి అవలంబిస్తూ సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రయోజనాలను బలి పెడుతున్నారు. 




గత ఏడాది అక్టోబరులో అపెక్స్ కౌన్సిలు సమావేశం జరిగింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకుంటే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ నదీ జలాల పంపిణీని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు నివేదించుతానని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి షెకావత్ తెలంగాణ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణ సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని కొత్తగా ట్రిబ్యునల్‍గాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు గాని అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు నివేదించమని కోరింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించారు? అంతేకాదు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలులో లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవిగా భావింపబడుతున్నాయి. 11 షెడ్యూలులో లేకున్నా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి దిండి తదితర ప్రాజెక్టుల గురించి ఏపీ ముఖ్యమంత్రి సమావేశంలో గట్టిగా ఎందుకు నిలదీయ లేదు? పైగా కేంద్ర జల సంఘం వద్ద సాంకేతిక అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవి అని కేంద్ర మంత్రి నిర్వచనం ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదించడంతో ఏపీ పలు పాత ప్రాజెక్టులకు సమస్యలు వచ్చిపడ్డాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెర మీదకు తెచ్చింది. ఒక్క పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనుల విషయంలో మౌనం పాటించినందున ఇప్పుడు గోడ దెబ్బ చెంప దెబ్బ తినవలసి వస్తోంది.




వాస్తవంలో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణ జలాల కేటాయింపులపై వివాదం లేదు. చట్టబద్ధత గల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉంది. ఎవరి వాటా ఎంతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు విధించిన స్టే మేరకు అమలులోలేని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులోనూ స్పష్టంగా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రాంతం తరపున సరైన వాదన వినిపించ లేదనేది తెలంగాణ ఫిర్యాదు. ఇందుకు న్యాయపరంగా ఎలాంటి ఆధారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగడం కేంద్రమంత్రి సరే అనడం మన ముఖ్యమంత్రి మౌనం దాల్చడంతో నేడు అసలుకే మోసం వస్తోంది. 




సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీలో ఉన్న సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు జోలికి వెళ్లలేదు. ఒక దఫా కేటాయింపులు జరిగి అవి "వినియోగంలో" ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేసే అవకాశం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరిగిందని ఇప్పుడు తెలంగాణ గోల చేస్తుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎలా తీసుకొంటుంది? కేంద్రం కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోనికి రాకున్నా దానికి అనుగుణంగా ఒకవైపు కర్ణాటకకు పగ్గాలు వదలిపెట్టి మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ గొంతు కోస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించబోతోంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీయస్ కేటాయించిన నాలుగు టిఎంసిల వినియోగానికి కాలువ తవ్వతుండగా ఇప్పుడు కేసీఆర్ గోల చేస్తున్నారు. 11వ షెడ్యూలులో లేని ప్రాజెక్టులను తెలంగాణ చకా చకా నిర్మిచుకుపోతుంటే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ కోర్టులను ఆశ్రయించినట్లు ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులకెక్కడం లేదు? 




రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగని నీళ్లు ఉన్నా లేదా నీటి ఎద్దడి ఉన్నా ఈ సందర్భాల్లో ప్రొటొకాల్ ఏమిటో నిర్ణయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు బాధ్యతను అప్పగించింది. వాస్తవం ఇదైతే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు తిరిగి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం ఎందుకు నివేదిస్తోంది? అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అడ్డుకోలేదు? 




ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు నివేదిస్తే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‍లో "వినియోగం"లో ఉన్న నీటి కేటాయింపులు పక్కనపెట్టే అవకాశం ఉంది. తిరిగి మొత్తంగా కృష్ణ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్‍కు అధికారం దఖలు పడుతుంది. దీనివల్ల ఇప్పుడు ఉన్న కేటాయింపులు మారిపోవచ్చు. ప్రధానంగా బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమకు చేసిన కేటాయింపుల్లో భారీ కోత పడవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ బేసిన్ నుంచి ఇతర బేసిన్ (పెన్నా)లకు నీరు తరలించుతోందనేది తెలంగాణ ప్రధానమైన ఫిర్యాదు. 




సహజ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణ డిమాండ్ సమంజసం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1969లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అప్పటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా బేసిన్‍లో వున్న మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపకం చేసింది. ఒకవేళ తిరిగి పంపిణీ జరిగినా అన్ని రాష్ట్రాల మధ్య జరగాలి. అందుకూ ఈ పాటికే కేంద్రం గండికొట్టింది. అంతే కాదు, బచావత్ ట్రిబ్యునల్ కూడా తన ఫైనల్ తీర్పు చాప్టర్ 7 క్లాజు 14లో 2000 సంవత్సరం మే 31 తర్వాత నియమింపబడే కొత్త ట్రిబ్యునల్ రివ్యూ లేక రివిజన్ చేసే సమయంలో ఏ రాష్ట్రానికైనా తాము కేటాయించిన నీటికి లోబడి అట్టి నీరు "వినియోగంలో" ఉంటే మార్పు చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నది. ఆంధ్ర ప్రదేశ్‍కు చెంది బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరు మొత్తంగా వినియోగంలో వున్నందున బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ కేటాయింపుల జోలికి వెళ్లలేదు. మిగులు నికర జలాలను మాత్రం పంపిణీ చేసి దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు క్యారీ ఓవర్ కింద కేవలం 150 టియంసిలు మిగిల్చింది. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిల మాత్రమే పంపకం చేయాలి. దీనితో పాటు గోదావరి జలాలు 80 టియంసిల కృష్ణకు చేరుతున్నందున తెలంగాణ వాటా ఎంతో నిర్ధారణ అయి వాటిని పంపకం చేయవలసి వుంది. ఇంతకు మించి పంపకానికి ఏమీ నీళ్లు మిగిలి లేవు. అదే జరిగితే రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ ఉన్న ప్రాజెక్టులకు తోడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం అవుతాయి. ఈ ప్రమాదం గ్రహించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వ్యూహాత్మకంగా కేంద్రమంత్రి వద్ద హామీ తీసుకొని సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. 




రాష్ట్ర విభజన అనంతరం 2015 డిసెంబరులో కృష్ణ జలాల పంపిణీ విషయంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. కృష్ణ జలాల పంపిణీ బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య జరగాలనా? లేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనా? అన్న విషయం మీద కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లు నాన బెట్టి తుదకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ వైపు నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట విచారణాంశాలుగా ఉన్న కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణ వ్యూహాన్ని అవగతం చేసుకోగలం: 1) ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో కెసి కెనాలుకు ఉన్న కేటాయింపును సమీక్షించి బేసినులోని ప్రాజెక్టులకు తిరిగి పంపిణీ చేయాలి. 2) పక్క బేసినులోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న కెసి కెనాల్ యస్ఆర్ బిసి సాగర్ కుడి కాలువ తుంగభద్ర ఎగువ కాలువ పంట విధానంలో మార్పుచేసి ఆదా అయ్యే నీటిని ఇతర ప్రాజెక్టులకు కేటాయించాలి. 3) ఇతర మార్గాల ద్వారా వినియోగానికి అవకాశం ఉన్న తెలుగుగంగ ఆర్డీయస్ కుడి కాలువలకు ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ చేసిన నీటి కేటాయింపులను సమీక్షించాలి. ఇవీ తెలంగాణ డిమాండ్లలో కొన్ని. మొత్తం 18 అంశాలు విచారణాంశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి గొంతెమ్మ కోరికలు వ్యక్తం చేస్తే రేపు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు వాస్తవంలో ట్రిబ్యునల్‌ ముందు విచారణ జరిగితే ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమేగాక ఏపీ ప్రజలకు కుచ్చుటోపీ పెడుతుంది. 


వి. శంకరయ్య


విశ్రాంత పాత్రికేయులు

Thursday, 3 June 2021

Godavari - Kaveri Linkage is Dangerous to AP & Telangana.

 విజయవాడ

తేదీ: జూన్ 1, 2021

జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన "ఇచ్చంపల్లి నుండి గోదావరి - కావేరి నదుల అనుసంధానం" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధ్వందంగా తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.

గోదావరి నదిలో లభించే నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1480 టియంసిలను వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబునల్ అవార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు నికర జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం నిర్మించుకొంటున్నది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. గోదావరిలో నికర జలాలు లేవని చత్తీస్ఘర్ రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పింది.

గోదావరి నదీ జలాల వినియోగంపై కొత్త ట్రిబునల్ ను నియమించమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్రాత పూర్వకంగా కోరితే ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించినట్లు వెల్లడించారు.


ఈ పూర్వరంగంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి దాదాపు 250 టీయంసీలను తరలించడానికి గోదావరి - కావేరి నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టాలనే జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించడం అసంబద్ధం.

మొదటి అంశం నికర జలాలు లేవు. మిగులు/వరద జలాలను అంచనా వేయాల్సింది గోదావరి నదిపై చివరలో నిర్మించబడిన ధవళేశ్వరం ఆనకట్ట వద్ద. పైభాగంలో ఉన్న ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వరద జలాలను జూన్ - అక్టోబరు మాసాల మధ్య దాదాపు 250 టియంసిలను ఎలా తరలిస్తారు?

జాతీయ నదుల అనుసంధానం పథకంలో భాగంగా మహానది - గోదావరి అనుసంధాన పథకాన్ని చేపట్టాలంటే ముందుగా గంగా - బ్రహ్మపుత్ర - మహానది అనుసంధాన పథకాన్ని అమలు చేస్తేనే అంగీకరిస్తామని ఒడిస్సా పేచీ పెట్టి కూర్చున్నది.  మహానది - గోదావరి అనుసంధాన పథకాన్ని అమలు చేయకుండా గోదావరి - కావేరి నదుల అనుసంధాన పథకాన్ని ఎలా చేపడతారు?

ఈ పథకాన్ని అంగీకరిస్తే గోదావరి నుండి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని వాడుకొంటారు కాబట్టి కృష్ణా జలాల్లో మాకు వాటా పెంచాలని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రస్తుతం సుప్రీం కోర్టులో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై విచారణలో ఉన్న కేసు సందర్భంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదన తీవ్రహానికరమైనది. గోదావరి - కృష్ణా - పెన్నా అనుసంధాన పథకాన్ని పోలవరం ప్రాజెక్టు నుండి చేపట్టాలి. 

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన గోదావరి - కావేరి(ఇచ్చంపల్లి నుండి) నదుల అనుసంధాన పథకం ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులతో సమావేశాన్ని నిర్వహించి, చర్చించి, సమిష్టి నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

టి.లక్ష్మీనారాయణ

సమన్వయకర్త

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక


Saturday, 22 May 2021

Polavaram - Some Facts

 ఏది వాస్తవ‍ం!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ‍ం 2020_21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికను 2021 మే 19న విడుదల చేసింది. 2021_22 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభ మీ 21న ఆమోదించింది. ఈ రెండు అధికారిక పత్రాలను  ప్రామాణికంగా తీసుకొంటాం. వాటిలో పేర్కొన్న సమాచారం మధ్య తేడా ఉంటే దేన్ని నమ్మాలి?  


పోలవరం బాహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిద్దాం. 2020 నవంబరు నాటికి భూసేకరణ మరియు ఆర్&ఆర్ పనులు 23%, అనుసంధాన పనులు 70.54%, కుడి కాలువ పనులు 90.20%, ఎడమ కాలువ పనులు 68.88%,హెడ్ వర్క్స్ 70.54%, డయాప్ర‍ం వాల్ 100%, జెట్ గ్రౌటింగ్ 100%, తవ్వకం 84.76%, కాంక్రీటింగ్ 77.05% మరియు రేడియల్ గేట్లు 56.92%, మొత్తంగా 74.09% నిర్మాణ పనులు పూర్తయ్యాయని 2020-21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. 


2021_22 బడ్జెట్ ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ 66.86%, కుడి ప్రధాన కాలువ 91.69% మరియు ఎడమ ప్రధాన కాలువ 69.96% పనులు పూర్తయ్యాయి. 


2020-21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికను ప్రామాణికంగా తీసుకొంటే 2020 నవంబరు నాటికే పోలవరం హెడ్ వర్క్స్ 70.54% పూర్తి అయినట్లు భావించాలి. 2021_22 వార్షిక బడ్జెట్ ను ప్రామాణికంగా తీసుకొంటే హెడ్ వర్క్స్ 66.86% మాత్రమే పూర్తయినట్లు భావించాలి. 


టి. లక్ష్మీనారాయణ