Wednesday, 18 June 2025

CM Revanth Reddy on Banakacharla

CM Revanth Reddy on Banakacharla  

 బనకచర్ల పాపం కేసిఆర్ దే

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:49 AM

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ పదేళ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్లం. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్‌, హరీశ్‌ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆర్‌ కాదా? ఇదే అవకాశంగా తీసుకుని కృష్ణా బేసిన్‌ కొల్లగొట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్‌కు వచ్చారు. కేసీఆర్‌.. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటి?


తెలంగాణకు తీరని ద్రోహం చేశారు

2016, 2019లో చంద్రబాబు, జగన్‌తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గం సుగమం చేశారు

రాయలసీమను రతనాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీనిచ్చారు

ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడట్లేదంటూ మాపై బురద!

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, హరీశ్‌రావుదే

తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి

మోదీ వద్ద పలుకుబడి ఉన్నా బాబుకు అనుమతులు భ్రమే

‘గోదావరి-బనకచర్ల’పై మీడియాతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు బుఽధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌.. భేటీ ముగిశాక సచివాలయంలోనే ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే.. ఆ విషయంలో శిక్షించి, ఉరి తీయాల్సింది కేసీఆర్‌, హరీశ్‌రావునేనని ధ్వజమెత్తారు. వారు ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని.. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వపాపాలు చేసి, పాపాల భైరవులుగా మారి రాష్ట్రానికి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. వారే ఇప్పుడు.. ‘బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ మాట్లాడట్లేదు’ అంటూ తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వెంటనే తాము కేంద్ర మంత్రిని కలిసి.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్ని వివరాలనూ తెలిపామని సీఎం చెప్పారు. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రితోనూ చర్చించామని.. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ లేఖలు రాశారని గుర్తుచేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించడం వెనుక రాజకీయ ప్రేరేపిత అంశాలేవీ లేవన్న సీఎం.. భవిష్యత్‌ కార్యాచరణ, ప్రణాళికలపై ప్రతిపక్షాలను సూచనలు అడిగినట్టు తెలిపారు. రాజకీయ అంశాలకు అవకాశం ఇవ్వకూడదని భావించే.. ఈ భేటీకి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించామన్నారు.

ఆ సమావేశంలో చర్చించిన పలు విషయాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జలశక్తిభవన్‌, న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఆందులో అప్పటి సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆ సమావేశంలో గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణాలపై, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. 8 పేజీలతో సమావేశం వివరాలను నమోదుచేశారు. అందులో 6వ పేజీలోని రెండో పేరాలో పేర్కొన్న దాని ప్రకారం ‘‘గోదావరి జలాల్లో 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో నిర్మించుకునే ప్రాజెక్టులకు 1000 టీఎంసీల అవసరం ఉంది. గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చ’’ని పేర్కొన్నారు. అంటే గోదావరిలో 3వేల టీఎంసీలు వృధా అవుతున్నాయి, వాటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించి తద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే విషయానికి పునాది పడింది అప్పుడే. ఇది అధికారిక సమావేశంలో చెప్పిన విషయం. ఈ విషయం అప్పటి మంత్రి హరీశ్‌కు తెలియదనడం కరెక్ట్‌కాదు. ఈ వివరాలను హరీశ్‌కు పంపుతా’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత.. కేసీఆర్‌, చంద్రబాబుల మధ్య ఉన్న వైరాలు, అంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నారు. 2019లో ఏపీలో జగన్‌ సీఎం అయ్యాక.. తెలంగాణలో కేసీఆర్‌ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. వారిద్దరూ 2019 జూన్‌ 28, ఆగస్టు, సెప్టెంబరు, మళ్లీ ఆ తరువాత ఏడాది ఆగస్టు నెలల్లో.. మొత్తం నాలుగు సార్లు భేటీ అయ్యారని, ఆ సమావేశాల్లోనే జలబంధం ఏర్పడిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అప్పట్లో కేసీఆర్‌ సొంత పత్రికలో ప్రచురించిన పలు కథనాలను సీఎం విలేకరుల సమావేశంలో చూపించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం ద్వారా ‘నష్టం తక్కువ లాభం ఎక్కువ’ శీర్షికన ప్రచురితమైన కథనాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కేసీఆర్‌ వలనే బనకచర్ల..

ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్‌ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకెళ్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. జగన్‌ సీఎం అయ్యాక.. అప్పటి మంత్రి రోజా ఇంటిదగ్గర కేసీఆర్‌ ఏం మాట్లాడారో కూడా అందరూ చూశారని పేర్కొన్నారు. ‘‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. కలిసి పనిచేస్తాం. సమర్థమైన సీఎంగా జగన్‌ ఉన్నారు. నేను పెద్దన్నగా పూర్తిగా సహకరిస్తా. రాయలసీమను రతనాలసీమగా చేస్తా’’ అని కేసీఆర్‌ అప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. శాసనసభలో, వివిధ సందర్భాల్లో.. గోదావరి జలాలను పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి, ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి, ప్రోత్సహించిందే కేసీఆర్‌, హరీశ్‌ అని సీఎం దుయ్యబట్టారు. చంద్రబాబు గోదావరి జలాలను బనకచర్ల వరకూ తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించారని.. పరోక్షంగా మరో 100 టీఎంసీలను కలిపి మొత్తం 300 టీఎంసీల ప్రాజెక్టుకు సివిల్‌ వర్క్‌లు పూర్తి చేస్తున్నారని రేవంత్‌ తెలిపారు. గతంలో చర్చల సందర్భంగా కేసీఆర్‌.. 400 టీఎంసీల తరలింపునకు ప్రతిపాదన ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ప్రతిపాదనల ప్రకారమే చంద్రబాబు వ్యవహరిస్తే.. మొత్తం 400 టీఎంసీలను తీసుకెళ్లినా ఆఽశ్చర్యం లేదన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు గురించి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడగానే వెంటనే సాగునీటి మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న తమపై హరీశ్‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అలా అనుకుంటే పొరపాటే..

‘‘చంద్రబాబు నాయుడుకు సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే’’ అని సీఎం రేవంత్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమకు భేషజాలు లేవని.. అందరినీ కలిసి సమస్యను వివరిస్తామని.. అప్పటికీ న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. ‘‘గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే.. 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలి’’ అన్నారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక.. ఏపీ ఏ నీరు వాడుకున్నా తమకేమీ అభ్యంతరం ఉండదన్నారు. ‘‘చంద్రబాబు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు. కృష్ణా గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక.. మిగిలిన నీరు మీరు ఎలాగైనా వాడుకోండి’’ అని వ్యాఖ్యానించారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలను వివరిస్తామన్న సీఎం.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘అఖిల పక్ష భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పిలిస్తే సమయం లేదన్న ఆయన.. బుధవారం సాయంత్రం జలశక్తి మంత్రిని ఎలా కలిశారో.. ఎందుకు ముందే కలిశారో.. ఆ రహస్యాలను ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘రేపు మేం కలుస్తామని తెలిసి, ఇవాళ వెళ్లి కలవడం వెనుక ఏం కుట్ర ఉందో? అఖిలపక్ష సమావేశానికి రాకుండా ముందుగానే జలశక్తి మంత్రిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ధ్వజమెత్తారు. చట్టప్రకారం గోదావరి జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించుకునేందుకు బోర్డు ఉందని, సీఎం స్థాయి వరకూ కమిటీలు ఉన్నాయని.. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. అలాంటి బోర్డుకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండానే.. కేంద్రంలో పలుకుబడి ఉందని నేరుగా పై నుంచి కిందకు అనుమతులు తీసుకొస్తామంటే వీలుకాదని వ్యాఖ్యానించారు. ‘‘బోర్డు అనుమతించాక. పర్యావరణ శాఖ మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలవాలి. అలా కాకుండా పైనుంచే కిందకు అనుమతులు తెస్తామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. మేం అభ్యంతరాలను వ్యక్తం చేయడం వల్లనే ఇవాళ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడుతామని సీఎం రేవంత్‌ తేల్చిచెప్పారు. ఇందులో ఎలాంటి శషభిషలూ లేవన్నారు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ప్రస్తుతం తాము మొదటి అంకంలో ఉన్నామన్నారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ముందుగానే న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. కోర్టు వినదన్నారు. కాగా.. గత పాలనలో పదేళ్ల కాలంలో 96 క్యాబినెట్‌ సమావేశాలు జరిగాయని.. కానీ, ఒక్క భేటీలో కూడా కాళేశ్వరం అనుమతులపై చర్చ జరగలేదని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో అంచనాలు పెంచుకునేందుకు మాత్రమే అనుమతులు తీసుకోవడంపై చర్చించారని తెలిపారు.

తల ఎక్కడ పెట్టుకుంటావ్‌ హరీశ్‌..

హరీశ్‌రావుకు వయసు మీద పడిందని, ఆయన ఇంకా చిన్నపిల్లవాడు కాదని.. ఇకనైనా చిల్లర పనులు మానుకోవాలని సీఎం రేవంత్‌ హితవు పలికారు. ప్రాజెక్టుల విషయంలో అన్ని అంశాలనూ తాము బహిర్గతం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు హరీశ్‌ తన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘‘జీవితాంతం, కుటుంబం అంతా అబద్ధాలు చెప్పుకొంటూనే బ్రతుకుతారా?’’ అని నిలదీశారు. ‘‘కడుపునొప్పికి మందు ఉంది కానీ.. హరీశ్‌రావు అసూయకు మందు లేదు.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు కాళేశ్వరం అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ, నిజాలు నిప్పులాంటివి. అన్నీ బయటకు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి అవయవదానం చేసి.. ఆ పార్టీకి చెందిన 8 మంది అభ్యర్థులు గెలిచేలా బీఆర్‌ఎస్‌ పని చేసిందని.. అందుకే, హరీశ్‌ అబద్ధాలు చెబుతుంటే.. కిషన్‌రెడ్డి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని రేవంత్‌ విమర్శించారు. బుధవారం భేటీకి.. దామోదర్‌రావు, సురే్‌షరెడ్డి రాలేదని, అమాయకుడు వద్దిరాజు రవిచంద్రని పంపారని అన్నారు. ఆయన కూడా తనకు ఇచ్చిన కాగితంలో ఉన్నవాటినే చదివారని.. తాను కొన్ని విషయాలను లేవనెత్తగానే వెళ్లిపోయారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, ప్రమాదంలో మరణించిన పేదలకు పంచిపెడతారేమోనని 18 నెలల నుంచి చూస్తున్నానని.. కానీ పదిపైసలు కూడా ఇవ్వలేదన్నారు. కాగా.. రాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంపై కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను సీఎం రేవంత్‌ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

ఆ సూత్రం బనకచర్లకూ వర్తిస్తుంది

ఏపీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా 45 టీఎంసీల కృష్ణా జలాలు మనకు రావాల్సి ఉంటుందని.. అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. అదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకూ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి-బనకచర్లను 200 టీఎంసీల తరలింపు కోసంచేపడుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలు 300టీఎంసీలకు సరిపడా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో 120 రోజుల పాటు నీటిని తరలించడానికి అవసరమైన ఏరాట్లు చేస్తున్నారని తెలిపారు. గోదావరి జలాల తరలింపుపై కేసీఆర్‌ గతంలో అన్న మాటల గురించి సీఎం ప్రస్తావించినప్పుడు.. బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని.. ‘దీనిపై రాజకీయం వద్దు’ అన్నారు. దీనికి సీఎం.. తాను రాజకీయ అంశాలు ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు. గోదావరి జలాలను శ్రీశైలానికి, అక్కడి నుంచి రాయలసీమకు అందించాలనేదే కేసీఆర్‌ ఉద్దేశమని అన్నారు. దాంతో వద్దిరాజు సమావేశం నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. ఆయన బయటకు వెళుతుండగా.. మిగిలిన ఎంపీలు సముదాయించడానికి ప్రయత్నించారు. అప్పుడు సీఎం జోక్యం చేసుకుని.. ‘వెళ్లనివ్వండి... ఆయన ఇబ్బందులు ఆయనవి’ అని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తుతామన్నారు. గోదావరి -బనకచర్లకు వ్యతిరేకంగా ఎంపీలంతా కలిసి ఒక తీర్మానం చేస్తే, దాన్ని కేంద్రానికి అందిద్దామని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రం ఏర్పడ్డాకా బేసిన్‌ పారామీటర్‌, బేసిన్‌ వెంట నివసిస్తున్న జనాభా ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811టీఎంసీల్లో 555 టీఎంసీలను తెలంగాణకు కోరాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని.. 2021 దాకా ఈ ఒప్పందం కొనసాగిందని సీఎం మండిపడ్డారు. గోదావరి-బనకచర్లకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకెళతామని సీఎం ప్రకటించారు. ఈ సమయంలో డీకే అరుణ జోక్యం చేసుకొని... ‘ఎందుకు తమ్ముడూ (సీఎంనుద్దేశించి) ఏపీ వాళ్లు అంత స్పీడ్‌.. స్పీడ్‌గా పోతున్నరు’అని ప్రశ్నించగా.. ‘ఏపీ వాళ్లు అంతే అక్కా.. వాళ్లు ఉదయం 5 గంటలకు లేస్తే... మనం 11కు లేస్తాం’ అని సీఎం సరాదాగా జవాబు చెప్పారు. దాంతోసభ్యులంతా గట్టిగా నవ్వారు.


నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి, ఫిర్యాదు చేయడానికి.. సీఎం రేవంత్‌ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి ఉత్తమ్‌ బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి, గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశమై.. మెట్రో విస్తరణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం.. ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలవున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 03:49 AM

Friday, 13 June 2025

Godavari - Cauveri (GC) Link Project

 గోదావరి-కావేరీ అనుసంధానం సాధ్యమేనా?

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:42 AM

 

24న హైదరాబాద్‌లో నదుల అనుసంధాన సంప్రదింపుల కమిటీ భేటీ

 

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరి అనుసంధాన (జీసీ లింక్‌) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్‌లో జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు. కేంద్రం ఇప్పటి వరకూ పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును ఒప్పుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం న్యూఢిల్లీలో జరిగిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకొచ్చిందని ఆరా తీసినట్లు సమాచారం.

 

ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని పట్టుబట్టిన ఏపీ.. తాజాగా రూట్‌ మార్చి గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించే 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నుంచే ‘బొల్లాపల్లి-కావేరీ అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. పోలవరం విస్తరణలో భాగంగా రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు కొత్తగా గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది.

 

అంతటితో ఆగక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట గోదావరి-బనకచర్ల అనుసంధానానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరుతున్నది. బొల్లాపల్లి - కావేరీ అనుసంధానానికి ఒప్పుకుంటే మాత్రం.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

గోదావరి - కావేరి నదుల అనుసంధానం

 

సందర్భం

గోదావరి - కావేరి నదుల అనుసంధానం మరోసారి తెరమీదికి వచ్చింది.

ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను  తెలుసుకోవడానికి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA) జూన్ 24న హైదరాబాద్ లో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.

 

ఈ సమావేశానికి కేంద్ర జల వనరుల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

 

ప్రశ్నలు :

1.            గోదావరి - కావేరి అనుసంధానం (GC Link) ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం వుందా?

 

2.            ఈ ప్రాజెక్టువల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

 

3.            ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?

 

4.            తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?

 

5.            పోలవరం నుండి గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండేది. ఇప్పుడు బొల్లాపల్లి నుండి కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరుతోంది. ఈ మార్పుకు కారణం ఏమిటీ?

 

6.            గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటీ?

 

7.            ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46 (2), 46 (3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. అలా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం వుందా?

 

8.            బచావత్ ట్రిబ్యూనల్ నాటికి గోదావరి నదిలో మిగులు నికర జలాలున్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితివుందా?

 

9.            గోదావరి నుండి కావేరి బేసిన్ కు నికరజలాలను కేటాయిస్తారా?

 

10.       అలా చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సమస్యలు ఏమిటీ?  

Thursday, 2 January 2025

river linkage projects and the threat of biodiversity loss

 నదుల అనుసంధానం - ఆనందాలు - అనుమానాలు 

జలహారతికి ప్రపంచబ్యాంకు దన్ను

https://www.youtube.com/watch?v=PnKvpwQmZ8c 

గోదావరి - బనకచర్ల 

    

జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:23 AM

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

‘Telugutalli Jalaharathi’ : జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను

ఆ బ్యాంకు మిగులు నిధులపై చంద్రబాబు దృష్టి!

వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేయగా మిగిలే మొత్తాన్ని తీసుకునే యోచన

ఇప్పటికే ప్రధాని మోదీ,కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చర్చలు

ప్రస్తుతం 51,364 కోట్ల మిగులు

ఇందులో 40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత!

మిగతా 40 వేల కోట్లు కాంట్రాక్టు సంస్థల నుంచి సమీకరణ

‘తెలుగు తల్లికి జలహారతి’.. రాష్ట్రం దశ, దిశ మారుస్తుందని సీఎం చంద్రబాబు దృఢంగా విశ్వసిస్తున్నారు. దీనిని సాకారం చేయడానికి ప్రపంచ బ్యాంకు తోడ్పాటు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ బ్యాంకు వివిధ ప్రాజెక్టుల కింద మన దేశానికిచ్చిన రుణంలో మిగిలిపోయిన నిధులను ఈ పథకానికి మళ్లించే అంశంపై ఆయన దృష్టిసారించారు. అంచనా వ్యయం రూ.80,112 కోట్లలో 40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో కార్యాచరణకు నడుం బిగించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇతర రాష్ట్రాలతో లింకు పెట్టుకోకుండా.. నదుల అనుసంధానం కింద కాకుండా.. రాష్ట్ర అంతర్గత అనుసంధానం ప్రాజెక్టుగా దీనిని ఆయన ప్రతిపాదిస్తున్నారు. నదుల అనుసంధానం అంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు కూడా కావాలి. అంతర్గత అనుసంధానానికి ఆ అవసరం లేదు. అందుబాటులో ఉన్న మిగులు జలాలను కరువు సీమకు మళ్లించడంవరకే ఇది పరిమితం. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారు. ప్రాజెక్టు డాక్యుమెంటును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను త్వరలో పంపనున్నారు. ఇంకోవైపు.. నిధుల సాధనపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రపంచ బ్యాంకు మిగులు నిధులను ఈ ప్రాజెక్టుకు సాధించడానికి ఆయన పూనుకున్నారు.

వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి సమీకరించిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తం సుమారు ఆరు బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు అంచనా. రూపాయల్లో ఈ మొత్తం 51,364 కోట్ల వరకూ ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టు కోసం సేకరించిన రుణంలో ఖర్చుకాకుండా మిగిలే నిధులను మరో ప్రాజెక్టుకు వినియోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ పద్దు కింద ఉన్న నిధులను గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కోసం సాధించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికే దీనిపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్వరూపం ఎలా మారుస్తుందో.. రాష్ట్రానికి ఎంత ఉపయోగకరమో వారికి వివరించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.40 వేల కోట్ల వరకూ కేటాయించడానికి కేంద్రం సుముఖంగా ఉంది. ప్రపంచ బ్యాంకు మిగులు నిధుల నుంచే ఈ మొత్తం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విషయంలో ప్రపంచ బ్యాంకు వర్గాలు కూడా సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని, మంచి ఆలోచనలతో ముందుకు వస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం నుంచి కొంత సానుకూలత వ్యక్తమైన తర్వాతే ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు వివరాలను బహిర్గతం చేశారు. ప్రస్తుతం దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన జరుగుతోంది. 3 నెలల్లో సిద్ధంచేసి కేంద్రానికి పంపి.. అనుమతి వచ్చిన 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని సీఎం చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు సాగిస్తున్న ఆయన.. కేంద్రం నుంచి నిధులు సాధించి తెస్తారన్న గట్టి నమ్మకంతో అధికార వర్గాలు ఉన్నాయి.

మిగతాది భారీ కాంట్రాక్టు కంపెనీల నుంచి..!

కేంద్రం 40 వేల కోట్లు ఇవ్వగా.. ఇంకా మరో రూ.40 వేల కోట్లు జలహారతి ప్రాజెక్టుకు సమీకరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల పనులు చేపట్టే భారీ కాంట్రాక్టు సంస్థల నుంచి ఈ నిధులు సేకరించి వాటికి పాతికేళ్లపాటు ఏటా కొంత మొత్తం చెల్లించే నమూనా అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమికంగా అనుకుంటోంది. ఒక పెద్ద కాంట్రాక్టు కంపెనీ ఇప్పటికే కొంత ఆసక్తి చూపి అధ్యయనం చేస్తోంది. ఒక సంస్థ వల్ల కాకపోతే రెండు, మూడు ఏజెన్సీలను కలిపి కన్సార్షియంగా ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని సీఎం అనుకుంటున్నారు.

ప్రకాశం బ్యారేజీకి ప్రత్యామ్నాయం!

జలహారతి ప్రాజెక్టు తొలిదశలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి జలాలను విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీలోకి తరలించాలని.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువకు తీసుకెళ్లి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయరును నింపాలని తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. బ్యారేజీలోకి కాకుండా మరో మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ ఉంది. అందులోకి గోదావరి జలాలను తీసుకెళ్లాలి. ఇప్పుడు సాగర్‌ కాలువ ప్రవాహ సామర్థ్యం పది వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిని 30 వేల క్యూసెక్కులకు విస్తరించాలని తాజాగా భావిస్తున్నారు. గోదావరి జలాలు కలిసే చోటు నుంచి కాలువను వెడల్పు చేయాలనేది యోచన.

Updated Date - Jan 01 , 2025 | 04:23 AM

Chandrababu: 'తెలుగుతల్లికి జలహారతి'... భారీ ప్రాజెక్టు పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు

30-12-2024 Mon 17:21 | Andhra

 CM Chandrababu announces huge project name Telugu Talliki Jala Harathi

ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు

ఏపీకి  గేమ్ చేంజర్ అవుతుందన్న చంద్రబాబు

నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని వెల్లడి

ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు పేరును ప్రకటించారు. 'తెలుగుతల్లికి జలహారతి' అని ప్రాజెక్టు పేరు వెల్లడించారు. 

ప్రాజెక్టు గురించి చెబుతూ, రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా కరవు బారినపడుతున్నాయని వివరించారు. పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా... కృష్ణా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని వివరించారు. ఒక్క గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు. 

గోదావరి నీటిని మళ్లించలగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి నీటి కొరత అనే మాట వినిపించదని స్పష్టం చేశారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావడం... కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ్నించి బనకచర్లకు నీటిని తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన అంశం. ఇది మూడు దశల్లో ఉంటుంది. దీనిద్వారా వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అవుతుంది. 

నాగార్జునసాగర్ కుడి కాలువపై బొల్లాపల్లి ప్రాజెక్టు వస్తుంది... ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు... అక్కడ్నించి బనకచర్ల ప్రాజెక్టుకు నీళ్లు వెళతాయి. నల్లమల అడవులను కొంతమేర నరికి టన్నెల్ ఏర్పాటు చేసిన బనకచర్లకు నీళ్లు తీసుకువెళతాం. ఇదంతా జరిగితే నదుల అనుసంధానం పూర్తవుతుంది. ఈ  నదుల అనుసంధానం ప్రక్రియలో ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళ, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లా కొన్ని భాగాలు, నెల్లూరు, కడప, అనంతపురం... ఇలా రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకట్టు కూడా వస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ చేంజర్. అందుకే దీనిపేరు కూడా తెలుగుతల్లికి జలహారతి అని నామకరణం చేశాం. అంటే మనం సమర్పించుకోవడం. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టాం. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదికను పంపిస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

Andhra Pradesh to interlink rivers with Godavari-Banakacherla project 

The state government is contemplating completing the project in a hybrid system, through private partnership, besides Central and state funds. 

SNV Sudhir DHNS Last Updated : 31 December 2024...

Hyderabad: The Andhra Pradesh government plans to take up the Godavari-Banakacherla project that interlinks the Godavari and Krishna rivers.

The state government is contemplating completing the project in a hybrid system, through private partnership, besides Central and state funds. 

Chief Minister N Chandrababu Naidu discussed the project with Union Finance Minister Nirmala Sitharaman during his recent Delhi visit.

“We will complete the Detailed Project Report (DPR) in a couple of months and tenders will be called. If funds are provided on time, the project will be completed in three years,” he said in Amaravati on Monday.

Read more at: https://www.deccanherald.com/india/andhra-pradesh/andhra-pradesh-to-interlink-rivers-with-godavari-banakacherla-project-3336852

Naidu said he was confident that once this project was completed, Rayalaseema would turn into Ratanala Seema (land of diamonds).

Also, water could be supplied to Nellore through the Pennar river and the Prakasam district’s drought could be controlled after the Veligonda project was completed.

Naidu said that North Andhra was facing water scarcity despite experiencing heavy rainfall, while farming was seriously hit in the Rayalaseema, Prakasam, and Nellore districts due to drought.

Expressing concern over more than 3,000 tmcft of Godavari water flowing into the sea every year for the past 50 years, Naidu said it could be saved now as rainwater was being pumped into reservoirs on time.

If rivers were interlinked and reservoirs built wherever necessary, the state would never face any water scarcity, he said. 

Naidu also said he felt that the state suffered a lot due to the previous government’s inefficiency and illogical decisions, adding that the destroyed systems are being revived.


India's river linkage projects aim to transfer water from surplus river basins to water-deficient areas to address water scarcity, irrigation needs, and flood control. These projects fall under the broader framework of the National Perspective Plan (NPP) for water resources development, initiated in 1980 by the Ministry of Water Resources.

Here is a list of river linkage projects in India, including their execution timelines:


1. Ken-Betwa Link Project

  • States Involved: Madhya Pradesh and Uttar Pradesh
  • Purpose: Irrigation, drinking water supply, and hydropower generation.
  • Execution Timeline: Approved in 2021; construction began in 2022.
  • Key Features:
    • Transfers water from the Ken River to the Betwa River.
    • Includes the construction of the Daudhan Dam.

2. Par-Tapi-Narmada Link Project

  • States Involved: Maharashtra and Gujarat
  • Purpose: Irrigation and water supply in drought-prone areas.
  • Execution Timeline: Proposed in 2005; detailed project report (DPR) prepared in subsequent years. Execution is pending due to opposition from local communities.

3. Damanganga-Pinjal Link Project

  • States Involved: Maharashtra and Gujarat
  • Purpose: Augment water supply to Mumbai and nearby areas.
  • Execution Timeline: DPR prepared in 2014; awaiting implementation.

4. Godavari-Krishna Link Project

  • States Involved: Andhra Pradesh and Telangana
  • Purpose: Address water scarcity in Krishna basin through surplus water from the Godavari.
  • Execution Timeline: Operationalized in 2015 under the Pattiseema Lift Irrigation Scheme.
  • Key Features:
    • Transfers water via the Polavaram Right Main Canal.

5. Krishna-Pennar Link Project

  • States Involved: Andhra Pradesh and Telangana
  • Purpose: Irrigation and water supply to Rayalaseema and Nellore districts.
  • Execution Timeline: Proposed in the 2000s; execution is under planning.

6. Mahanadi-Godavari Link Project

  • States Involved: Odisha, Andhra Pradesh, and Chhattisgarh
  • Purpose: Transfer surplus water from Mahanadi to Godavari to meet irrigation and drinking water needs.
  • Execution Timeline: Proposed in the 2000s; execution pending.

7. Manas-Sankosh-Teesta-Ganga Link Project

  • States Involved: Assam, West Bengal, and Bihar
  • Purpose: Mitigate floods and provide irrigation in the Ganga basin.
  • Execution Timeline: Proposed under the NPP; DPR preparation is ongoing.

8. Pamba-Achankovil-Vaippar Link Project

  • States Involved: Kerala and Tamil Nadu
  • Purpose: Address water needs in Tamil Nadu.
  • Execution Timeline: Proposed in the 1990s; execution is pending due to environmental concerns.

9. Cauvery-Vaigai-Gundar Link Project

  • States Involved: Tamil Nadu
  • Purpose: Irrigation and water supply in southern Tamil Nadu.
  • Execution Timeline: Initial work began in 2009; execution ongoing.

10. Himalayan Component (Proposed Projects)

  • Key Links:
    • Brahmaputra-Ganga Link
    • Ganga-Yamuna Link
  • Purpose: Address water needs in northern India and manage flood control.
  • Execution Timeline: These projects are in the planning and feasibility study stages.

Challenges and Status

  1. Funding Issues: Many projects face delays due to high costs.
  2. Interstate Disputes: Conflicts over water-sharing agreements slow down execution.
  3. Environmental Concerns: Displacement, ecological damage, and biodiversity loss hinder progress.
  4. Public Opposition: Resistance from local communities and activists.

Conclusion

While some river linkage projects have been executed successfully, many remain in the planning or approval stages due to logistical, financial, and environmental challenges. The successful implementation of these projects could significantly transform India's water management system.

You said:
Is biodiversity loss a serious problem or fake criticism in the phase of river linkage projects? give detailed report on biodiversity loss in such cases.
ChatGPT said:
ChatGPT

Biodiversity Loss and River Linkage Projects: A Detailed Report

River linkage projects, while addressing critical water management issues, often raise serious environmental concerns, including biodiversity loss. These projects can disrupt ecosystems, displace species, and alter natural habitats. This report examines the extent of biodiversity loss in the context of river linkage projects, the criticisms surrounding them, and whether these concerns are valid or exaggerated.


1. Importance of Biodiversity in River Ecosystems

  • Ecosystem Services: Rivers support diverse ecosystems, providing water, food, and habitats for aquatic and terrestrial species.
  • Species Richness: Freshwater ecosystems host 10% of all known species, despite covering less than 1% of Earth's surface.
  • Cultural and Economic Value: Biodiversity in rivers supports fisheries, agriculture, and cultural traditions.

2. Impacts of River Linkage Projects on Biodiversity

a. Habitat Destruction

  • Construction of dams, canals, and reservoirs alters natural habitats.
  • Example: The Ken-Betwa Link Project will submerge parts of the Panna Tiger Reserve, endangering species like tigers, vultures, and gharials.

b. Disruption of Aquatic Ecosystems

  • Changes in water flow disrupt breeding cycles of fish and other aquatic species.
  • Example: Linking rivers with different flow regimes (e.g., Himalayan rivers with peninsular rivers) alters sediment and nutrient distribution, affecting aquatic life.

c. Loss of Forests and Wildlife Corridors

  • Large-scale deforestation for reservoirs and canals fragments habitats.
  • Example: The Par-Tapi-Narmada Link Project threatens forested areas in the Western Ghats, a UNESCO World Heritage site and biodiversity hotspot.

d. Invasive Species

  • Linking rivers can transfer invasive species from one basin to another, outcompeting native species.
  • Example: The spread of invasive fish species like tilapia in Indian rivers.

e. Altered Water Chemistry

  • Changes in water quality and sedimentation affect species adapted to specific conditions.
  • Example: Reduced sediment flow impacts the feeding grounds of riverine birds and aquatic species.

3. Evidence of Biodiversity Loss in River Linkage Projects

Case Studies in India

  1. Ken-Betwa Link Project:

    • Biodiversity at Risk: Tigers, leopards, vultures, and gharials.
    • Estimated Forest Loss: 6,000 hectares of forest, including parts of the Panna Tiger Reserve.
  2. Godavari-Krishna Link Project:

    • Impact: Changes in water flow disrupted fish migration and breeding in the Krishna River basin.
  3. Pamba-Achankovil-Vaippar Link Project:

    • Threat: Loss of endemic species in the Western Ghats due to habitat fragmentation.

Global Examples

  • China’s South-North Water Transfer Project:
    • Biodiversity Loss: Altered habitats in the Yangtze River basin.
    • Impact: Reduced fish populations and loss of wetlands.

4. Criticisms of Biodiversity Concerns

a. Valid Criticism

  • Scientific Evidence: Numerous studies document biodiversity loss due to large-scale hydrological alterations.
  • Irreversible Impact: Habitat destruction and species extinction are often permanent.

b. Claims of Exaggeration

  • Development Imperative: Proponents argue that the benefits of water security, irrigation, and flood control outweigh biodiversity concerns.
  • Mitigation Measures: Governments often propose compensatory afforestation, wildlife sanctuaries, and ecological flow maintenance as solutions.

5. Mitigation Measures for Biodiversity Conservation

  • Environmental Impact Assessments (EIA):
    • Conduct comprehensive EIAs to evaluate the ecological impact before project approval.
  • Wildlife Corridors:
    • Design corridors to allow safe movement of species across fragmented habitats.
  • Sustainable Engineering:
    • Use eco-friendly construction techniques to minimize habitat destruction.
  • Community Involvement:
    • Engage local communities in conservation efforts and decision-making.
  • Biodiversity Offsets:
    • Establish compensatory reserves to protect affected species.

6. Conclusion: Serious Problem or Fake Criticism?

The concerns over biodiversity loss in river linkage projects are real and significant, supported by scientific evidence and case studies. While these projects offer critical benefits, such as addressing water scarcity and improving agriculture, they come at a high ecological cost. The loss of biodiversity is not merely a "fake criticism" but a legitimate issue requiring balanced solutions.

7. Way Forward

  • Integrated Planning: Adopt a holistic approach that balances development and conservation.
  • Policy Reforms: Strengthen legal frameworks for biodiversity protection.
  • Technological Innovations: Use advanced modeling tools to predict and mitigate ecological impacts.
  • Monitoring and Evaluation: Implement long-term monitoring programs to assess biodiversity health.

By addressing biodiversity concerns proactively, India can achieve sustainable development while preserving its rich natural heritage.

You said:
Is there any river linkage projects executed in the Nizam Estate before 1948?

ChatGPT said:
ChatGPT

Yes, during the rule of the Nizams in the princely state of Hyderabad (1724–1948), there were significant water management initiatives, including irrigation and river linkage projects. Although these projects were not as elaborate as modern interlinking river projects, they demonstrated the Nizams' commitment to addressing water needs in the region.

Key River and Irrigation Projects in the Nizam's Estate

  1. Nizam Sagar Project (1923)

    • Purpose: Built on the Manjira River (a tributary of the Godavari) to provide irrigation and drinking water to the region.
    • Significance:
      • One of the earliest large-scale irrigation projects in India.
      • Created a reservoir that could irrigate over 250,000 acres of farmland.
    • Historical Importance: This project showcased the Nizam's vision for water resource management and agricultural development.
  2. Osman Sagar (1920) and Himayat Sagar (1927) Reservoirs

    • Purpose: These reservoirs were built on the Musi River to provide drinking water to Hyderabad city and prevent floods, following the devastating Musi River floods of 1908.
    • Impact:
      • Helped control flooding in Hyderabad.
      • Secured a stable water supply for the growing urban population.
  3. Musi and Manjira River Management

    • The Nizams undertook smaller-scale projects to manage water flow between the Musi and Manjira rivers, focusing on irrigation and water supply.
  4. Kakatiya Canals and Tank Systems (Revival Efforts)

    • While the tank systems date back to the Kakatiya dynasty (12th–14th centuries), the Nizams invested in their restoration and expansion.
    • These tanks and canals linked smaller water bodies and rivers to ensure sustainable irrigation.
  5. Dindi Reservoir Project (Proposed but Partially Executed)

    • Purpose: Aimed to harness the water of the Dindi River (a tributary of the Krishna) for irrigation and water supply.
    • Status: The project was conceptualized but not fully realized during the Nizam's rule.

Limitations of River Linkage Projects Under the Nizams

  • The technology and engineering capabilities of the time limited the scale of river interlinking.
  • The focus was more on localized water management (dams, reservoirs, and tanks) rather than large-scale river interlinking as seen in modern projects.

Conclusion

While the Nizams did not execute large-scale river linkage projects akin to modern interlinking projects, their efforts in water resource management were ahead of their time. Projects like the Nizam Sagar and Osman Sagar were instrumental in addressing irrigation and drinking water needs, and their legacy continues to benefit the region even today.

Sunday, 8 September 2024

Prakasham Barrage - Dredging Boats Conspiracy ???

 

బ్యారేజీపై ‘కుట్ర’!

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:06 AM

కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే..

బ్యారేజీపై ‘కుట్ర’!

బోట్లను కావాలనే వదిలేశారా?

నందిగం సురేశ్‌, తలశిల అనుచరుల పాత్ర?

అందులో మూడు బోట్లు ఒకరివే

ఇనుప గొలుసుతో మూడూ అనుసంధానం

ప్లాస్టిక్‌ వైరుతో చెట్టుకు లంగరు

స్థానికులు హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యం

అంతకుముందు నదికి ఆవల లంగరు

ఇటీవలే గొల్లపూడి వైపునకు మార్పు

లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు

(విజయవాడ/అమరావతి-ఆంధ్రజ్యోతి)

కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ... అది జరిగిన తీరు, బోట్ల యజమానుల నేపథ్యాన్ని పరిశీలిస్తే దీని వెనుక ‘కుట్ర’ దాగి ఉందని ప్రభుత్వానికి పోలీసులు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అదే సమయంలో... బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి ఐదు ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో మూడు బోట్లు బ్యారేజీ గేట్ల వెనుక ఉండే కౌంటర్‌ వెయిట్లను బలంగా ఢీ కొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69వ ఖానాల వద్ద చిక్కుకుని ఉన్నాయి. ఈ మూడు బోట్ల యజమాని పేరు... ఉషాద్రి. ఆయన... తలసిల రఘురామ్‌కు సన్నిహితుడైన రామ్మోహన్‌ అనుచరుడు. రామ్మోహన్‌, ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణా నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌ చేస్తున్నారు.

అనుమానాలు ఎందుకంటే...

ఐదు బోట్లలో మూడింటిపై వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. అందులోనూ... ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టరు. ఎందుకంటే... కొటి కొట్టుకుపోతే మిగిలినవీ కొట్టుకుపోతాయి. పైగా... ఇలా ఒకదానికొకటి కట్టేసిన మూడు బోట్లను ఒక ప్లాస్టిక్‌ తాడుతో గొల్లపూడి శ్మశానం వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి ఉంచారు. ఒక్కోటి 40-50 టన్నులున్న బోట్లు... పైగా మూడింటిని ఇనుప గొలుసులతో కట్టి... అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్‌ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి బలమైన తాడు కూడా వాడలేదు. కృష్ణా నదిలో వరద పెరుగుతోందని, బోట్లను పకడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరికి... మూడు బోట్లు ‘కలిసికట్టు’గా వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. మరో రెండు బోట్లు కొట్టుకు రావడానికి కారణం ఈ మూడు బోట్లేనని, ఇవి ఢీకొనడంతో అవి కూడా నదిలోకి కొట్టుకు వచ్చాయని పోలీసులు నిర్ధారించారు.

ఇసుక దందాలో...

ఈ ఘటనలో రామ్మోహన్‌, ఉషాద్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరికీ నందిగం సురేశ్‌, తలసిల రఘురామ్‌లతో సంబంధాలున్నాయని తేల్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, జగన్‌కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కృష్ణా నదిలో ఇసుక దందాను బాగా కొనసాగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప బోట్లను నదిలో తిప్పుతూ ఇసుకను ఒడ్డుకు చేర్చేవారు. ఈ వ్యవహారాలు నందిగం సురేశ్‌, తలశిల రఘురాం కనుసన్నల్లో జరిగాయన్నది బహిరంగ రహస్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బోట్లు నదికి ఆవలన ఉద్దండరాయనిపాలెం వైపు నిలిపి ఉండేవి. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవి. ఇటీవలే ఇవి గొల్లపూడి వైపు వచ్చాయి. దీనిపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌంటర్‌ వెయిట్లకు జరిగిన నష్టంపై కేఆర్‌సీ (కృష్ణా రివర్‌ కన్జర్వేషన్‌) ఈఈ పీవీఆర్‌ కృష్ణారావు విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ గురుప్రకాశ్‌ ఈ ఫిర్యాదుపై క్రైం నంబరు 171/2024తో ఐపీసీ 336(రాష్‌ అండ్‌ నెగ్లిజన్స్‌), పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్‌ 3 కింద కేసు నమోదు చేశారు.

ముందు నుంచే అనుమానాలు...

బ్యారేజీ వద్ద కౌంటర్‌ వెయిట్ల ఏర్పాటును పరిశీలించిన జలవనరుల శాఖ మంతి నిమ్మల రామానాయుడు... బోట్లు ఢీ కొన్న ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయట పడతాయని అభిప్రాయపడ్డారు. నదిలో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు చెక్క బోట్లను ఉపయోగిస్తారు. ఇసుకను తరలించడానికి ఇనుప బోట్లను ఉపయోగిస్తారు. ఈ రెండు రకాల బోట్లు నదిలో సంచరించాలంటే బోట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉండాలి. దీంతో పాటు మత్స్యశాఖ, జలవనరుల శాఖ అనుమతులు ఉండాలి. ప్రతి ఏడాది రెన్యువల్‌ చేయించుకోవాలి. ఈ మూడు బోట్లకు చెందిన యజమానులకు బోట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం, ప్రభుత్వ అనుమతులు లేవని గొల్లపూడి బోట్ల యజమానులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల ముందుకు యజమానులు