Tuesday 20 September 2022

Polavaram RR Package

 Published: Tue, 20 Sep 2022 03:13:03 ISTహోంఆంధ్రప్రదేశ్పోలవరంపై నిండు సభలో బొంకులు!twitter-iconwatsapp-iconfb-iconపోలవరంపై నిండు సభలో బొంకులు!

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750అబద్ధాల సీరియల్‌ 3.0

నిర్వాసితులకిచ్చిన మాట మార్చేశారునిర్వాసితులందరికీ 10 లక్షలిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ వాగ్దానంఇప్పుడు సభలో నాలుక మడత

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితులకు భూపరిహారం చెల్లింపులో నిండు సభలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు బొంకులతో బుకాయింపులకు దిగారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎకరాకు ఇస్తున్న రూ.6.5 లక్షలు చాలడం లేదని.. తాను అధికారంలోకి వస్తే రూ.పది లక్షల చొప్పున ఇస్తానని ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. 2021 జూన్‌ 30వ తేదీన పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపుపై ఉత్తర్వు జారీ చేశారు. అయినా ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇచ్చిన మాట మేరకు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ఎకరాకు పది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రతిపక్షం అసెంబ్లీలో డిమాండ్‌ చేసింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభలో దీనిపై చర్చ జరిగింది. ఎకరాకు పది లక్షల రూపాయలిస్తామని జగన్‌ ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి అంబటి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్పష్టం చేశారు.

అయితే సీఎం జోక్యం చేసుకుని.. పది లక్షల పరిహారంపై తాను హామీ ఇచ్చానని.. ఆమేరకు 2021 జూన్‌ 30వ తేదీన జీవో ఇచ్చానని చెప్పారు. గతంలో ఏం మాట ఇచ్చామో దానికి కట్టుబడి ఉన్నామన్నారు. డ్యాం పూర్తయ్యాక మొదట డ్యాం భద్రత దృష్ట్యా నీటిని 41.15 మీటర్ల కాంటూరులో నిల్వ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు గాను 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 20,946 కుటుంబాలు వస్తాయని.. మిగిలిన 85,060 కుటుంబాలు 45.72 మీటర్ల కాంటూరు పరిధిలోకి వస్తాయని తెలిపారు. వీరిలో 41.15 మీటర్ల కాంటూరు లెవల్‌కు వచ్చే 14,110 కుటుంబాల పునరావాసం రూ.1,960.95 కోట్లతో పూర్తయుందని వెల్లడించారు. ‘ 2019 నుంచి ఇప్పటి వరకూ 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1,773 కోట్లు ఖర్చు చేశాం. 41.15 కాంటూరు వరకూ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన 6,836 నిర్వాసిత కుటుంబాలను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తాం. ఈ 6,836 కుటుంబాలకు ఎకరాకు పది లక్షల చొప్పున చెల్లించేందుకు రూ.500 కోట్లు మాత్రమే ఖర్చవుతాయి. వీటిని చెల్లిస్తాం’ అని వెల్లడించారు. ఎకరాకు లక్షన్నర చొప్పున చెల్లించిన వారికి మరో మూడున్నర లక్షలు చెల్లిస్తామని జగన్‌ చెప్పారు.

వారికి మొండిచేయే! ముఖ్యమంత్రి ప్రసంగాన్ని పరిశీలిస్తే.. కేవలం 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని 20,946 కుటుంబాలకు మాత్రమే ఎకరాకు రూ.పది లక్షలు ఇస్తాయన్న మాట. 45.72 మీటర్ల కాంటరు పరిధిలోని వచ్చే మిగతా 85,060 కుటుంబాలను గాలికి వదిలేసినట్లే! వారికి పది లక్షలు ఇవ్వబోవడం లేదని చెప్పకనే చెప్పేశారు. తమకు రూ.6.5 లక్షలే వస్తున్నాయని.. అని చాలడం లేదని నిర్వాసితులు చెప్పారని.. దాంతో వారు పరిహార దీక్ష చేస్తున్నప్పుడు తాను అధికారంలోకి వస్తే ఎకరాకు పది లక్షలిస్తానని చెప్పానని.. ఇప్పుడు ఎన్నికల సభలోనూ అదే హామీ ఇస్తున్నానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ స్పష్టం చేశారు. అయితే పరిహార దీక్షలో గానీ.. ఎన్నికల ప్రచారంలో గానీ ఎక్కడా 41.15 మీటర్లకే పరిమితమవుతామని ఆయన చెప్పలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. 41.15 మీటర్ల కాంటూరుకే అంటే.. 20,946 కుటుంబాలకే ఎకరాకు పది లక్షలు చెల్లిస్తామని ఆయ న చెప్పడం విస్తుగొల్పుతోంది. జగన్‌ మరోసారి మాటమార్చా రని.. మడమ తిప్పేశారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Tuesday 15 February 2022

నదుల అనుసంధానం డేంజర్‌ - రాజేంద్రసింగ్‌

 నదుల అనుసంధానం డేంజర్‌

నీళ్లపై, నదులపై రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే ఆ పథకం ఉద్దేశం

VDO.AI

నీటి ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణే  దాని లక్ష్యం.. నదుల పునరుజ్జీవనం జరగాలివాటితో ప్రజల్ని అనుసంధానించాలి.. వాణిజ్య పంటలతోనే కావేరిలో నీటి కొరతతెలంగాణలో వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌అదే జరిగితే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది

‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం దేశానికి మంచిది కాదని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె పురస్కార గ్రహీత రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. రాష్ట్రాలకు నీళ్లపై, నదులపై ఉన్న హక్కులను లాక్కొని బడా వర్గాలకు కట్టబెట్టడానికే నదుల అనుసంధానం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నదులపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో వివరాలు వెల్లడించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. 

ఆంధ్రజ్యోతి: ఏటా గోదావరిలో మూడువేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కావేరిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు నదుల అనుసంధానం పరిష్కారం కాదా?రాజేంద్రసింగ్‌: కాదు. ఎందుకంటే నదుల అనుసంధానమే తప్పు. నదుల అనుసంధానం పేరిట పనులు చేపడితే ఇదివరకే ఉన్న నదులన్నీ దెబ్బతింటాయి. నదులపై, నీళ్లపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కాలరాయడమే ఆ పథకం లక్ష్యం. నదులపై హక్కులను బడాబాబులకు అప్పగించాలనే కుట్ర నదుల అనుసంధానంలో ఉంది. నదుల సహజత్వం ఈ పథకం వల్ల దెబ్బతింటుంది. ఎక్కడికక్కడ నీటి వనరులను కాపాడుకుంటూనే భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక కావేరీలో నీటి కొరతకు ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న వాణిజ్య పంటలే. ఒక టీఎంసీ నీటితో తెలంగాణలో 12 వేల ఎకరాలు సాగవుతుండగా... కావేరీ పరివాహక ప్రాంతంలో ఒక టీఎంసీతో మూడువేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పంటలు పండిస్తున్నారు.  

నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో మీరు కూడా సభ్యులే కదా?ఒకప్పుడు నేను కూడా ఆ కమిటీలో సభ్యుణ్ని. అయితే నాకిచ్చిన పత్రాలన్నీ తీసి... పక్కన పడేశా. నదుల అనుసంధానం వద్దని తొలి నుంచి వాదిస్తూనే ఉన్నా. నీటిని ప్రైవేటీకరించి, వ్యాపారం చేయాలనే లక్ష్యాలు నదుల అనుసంధానం వెనుక ఉన్నాయి. నదుల అనుసంధానంతో సామాజిక, ఆర్థిక, సాంస్కతిక అంతరాలు ఏర్పడి, దేశం సంక్షోభంలోకి వెళుతుంది. నీటి ప్రైవేటీకరణలో భాగమే ఈ పథకం. నదుల అనుసంధానం కాదు. నదులతో ప్రజలను అనుసంధానించాలి.  నదుల అనుసంధానం లేకపోతే కరువు ప్రాంతాల్లో అభివృద్ధి ఎట్లా?నీళ్లు అవసరమే.. కానీ అత్యాశ పనికిరాదు. గంగా మాయీ (గంగమ్మ) కమాయి (ఆదాయం) కారాదు. గంగానది 11 రాష్ట్రాలు, పలు దేశాల్లో ప్రవహిస్తుంది. గంగానది అనుసంధానం ప్రతిపాదించినా జరగలేదు. రాజస్థాన్‌లో తక్కువ వర్షపాతం ఉంది. ఆ రాష్ట్రంలో 12 నదుల పునరుజ్జీవనం చేశాం. ఆ పని దేశమంతా జరగాలి. స్థానికంగా ఉన్న నదుల పునరుజ్జీవనం జరగాలి. వాణిజ్య పంటల సాగు కూడా నీటి సంక్షోభానికి కారణం. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి.  

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే గెజిట్‌పై మీ అభిప్రాయమేంటి?రివర్‌ బేసిన్‌ అథారిటీ బిల్లు, డ్యామ్‌ సేఫ్టీ బిల్లులు సిద్ధమైనప్పుడే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను కలిసి, నదులు, చెరువులపై హక్కులను కేంద్రం లాక్కునే కుట్రను వివరించా. అయినా ఒక్క సీఎం కూడా స్పందించలేదు. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రం నేతృత్వంలోని బోర్డులకు అప్పగిస్తూ గెజిట్‌ జారీ అయింది. నదులపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాలరాయడంలో భాగంగా వేసిన తొలి అడుగే ఇది. 

తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై?సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం. గోదావరి నదిని 200 కిలోమీటర్ల మేర పునరుజ్జీవనం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆనందం కలిగింది. హరితహారం కార్యక్రమంతో పాటు ఇంటింటికీ నీరిచ్చే మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ, ఆరుతడి పంటల సాగుకు తెలంగాణ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. మనిషిని, నీళ్లను జోడించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా వాటర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వాటర్‌ యూనివర్సిటీ లేదు. నీటి అవసరం, ప్రాధాన్యాన్ని భావితరాలకు అందించేలా పరిశోధనలు జరగాలి.

27 నుంచి నదులపై జాతీయ సదస్సు హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదులపై ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ తెలిపారు. భారతీయ ద్వీపకల్ప నదీ పరివాహక మండలి, భారతీయ హిమాలయ నదీ పరివాహక మండలి  సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో తెలంగాణ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్‌ సంస్థలు పాల్గొననున్నాయని ఆయన వెల్లడించారు. మంగళవారం జలసౌధలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏడేళ్లుగా జల వనరులపై కీలక పనులు జరుగుతున్నాయని, 200 కిలోమీటర్ల మేర గోదావరి నది పునరుజ్జీవనం జరిగిందని చెప్పారు. కాగా గెజిట్‌తో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గెజిట్‌ను వ్యతిరేకించాల్సిందేనని ఆయన అన్నారు.