Monday 5 July 2021

Rayalaseema Lift Irrigation is illegal - Telangana

 రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ముమ్మూటికీ అక్రమమే

3-7-2021

 హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ముమ్మూటికీ అక్రమమేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కేసీఆర్ మాట్లాడుతూ  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టుగా ఏపీ గుర్తించడం లేదన్నారు. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అక్రమమేనని ఆయన అన్నారు.


 ఈ నెల 9న నిర్వహించే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారు. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ కోరారు. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలన్నారు. కృష్ణా బోర్డు సమావేశంలో తమ వాదన వినిపిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. జలవిద్యుత్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. కృష్ణా జలాలు సముద్రంలోకి వృథా చేస్తున్నారనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటినే శ్రీశైలం ప్రాజెక్టులో వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. శ్రీశైలం డ్యాం దగ్గరికి ప్రాజెక్టు ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని కేసీఆర్ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment